తెలుగు సినిమా ఒకటి సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. వర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఎస్.సరస్వతి’. ఈ సినిమా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండానే సడెన్ గా శుక్రవారం (ఏప్రిల్ 3) డిజిటల్ డెబ్యూ చేసింది.
ఎస్.సరస్వతి ఓటీటీ

సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడామె మెగా ఫోన్ పట్టింది. ఫస్ట్ టైమ్ సినిమాకు దర్శకత్వం వహించింది. ఆమె డైరెక్ట్ చేసిన ‘ఎస్.సరస్వతి’ సినిమా ఈ రోజు ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైలెంట్ గా వచ్చేసింది.
టైటిల్ తో కాంట్రవర్సీ
వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన ఎస్.సరస్వతి మూవీ టైటిల్ పై వివాదం రేగింది. ఫస్ట్ ఈ సినిమాకు సరస్వతి అని పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత అభ్యంతరాలు రావడంతో ఎస్.సరస్వతిగా మార్చారు. ఈ చిత్రం మార్చి 6, 2026న థియేటర్లలో రిలీజైంది.
కథను అత్యాచారం
సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా, వరలక్ష్మికి మధ్య మాటల యుద్ధం నడిచింది. ‘ఇది తన కథ కాదు అని, కథను అత్యాచారం చేశారని’ సాయి మాధవ్ సంచలన పోస్టు పెట్టాడు. ‘అత్యాచారం అని ఎలా అంటారు. కథను మారుస్తున్నట్లు చెప్పాలనుకున్నా. కానీ ఆయన దొరకలేదు’ అని వరలక్ష్మి స్ట్రాంగ్ గా రియాక్టయింది.
థియేటర్ రెస్పాన్స్
ఎస్.సరస్వతి సినిమాకు థియేటర్లో రెస్పాన్స్ అంతంతమాత్రంగానే వచ్చింది. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, జీవా, ప్రియమణి, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాను పూజా శరత్ కుమార్ తో కలిసి వరలక్ష్మినే ప్రొడ్యూస్ కూడా చేసింది.
ఎస్.సరస్వతి స్టోరీ
{{/usCountry}}ఎస్.సరస్వతి సినిమాకు థియేటర్లో రెస్పాన్స్ అంతంతమాత్రంగానే వచ్చింది. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, జీవా, ప్రియమణి, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాను పూజా శరత్ కుమార్ తో కలిసి వరలక్ష్మినే ప్రొడ్యూస్ కూడా చేసింది.
ఎస్.సరస్వతి స్టోరీ
{{/usCountry}}లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తుంటుంది. ఆగస్టు 15న తన కూతురైన ఎస్.సరస్వతిని స్కూల్ లో డ్రాప్ చేసి వెళ్తుంది. సాయంత్రం పాపను తిరిగి తీసుకెళ్దామని వస్తే అసలు సరస్వతి అనే పేరుతో పాపనే లేదని స్కూల్ వాళ్లు చెప్తారు.
ఆ తర్వాత తన పాపను స్కూల్ లోనే ముగ్గురు రేప్ చేసి చంపేశారని లక్ష్మి పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇస్తుంది. శవాన్ని పాతిపెట్టారని ఓ ప్లేస్ చూపిస్తుంది. కానీ అక్కడ ఏం ఉండదు. లాయర్ రామానుజం (ప్రకాష్ రాజ్) సాయంతో లక్ష్మి కోర్టును ఆశ్రయిస్తుంది. కానీ ఆధారాలు లేవని కోర్టు కేసును కొట్టివేస్తుంది.
కట్ చేస్తే ఓ జడ్జీని, ఐఏఎస్ ఆఫీసర్ ను, పోలీస్ ను లక్ష్మి మర్డర్ చేస్తుంది. వీళ్లు తన కూతురిని చంపారని చెప్తుంది. అసలు ఇంతకు లక్ష్మికి కూతురు ఉందా? ఆమె గతం ఏంటీ? అన్నది ఎస్.సరస్వతి మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.