...
...
Next Story

Salman Khan: 3 సార్లు గుండె మార్పిడి, సల్మాన్ ఖాన్‌తో రాత్రి 2 గంటల ఫోన్ కాల్- సర్జరీ విషయాలు గుర్తు చేసుకున్న ఫ్యాన్

Salman Khan Fan Reena Raju On Heart Transplant: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సున్నితమైన మనసును ఒక వీరాభిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. మూడు సార్లు గుండె మార్పిడి చేయించుకున్న రీనా రాజు, తన ప్రాణాపాయ స్థితిలో సల్మాన్ ఖాన్ ఎలా అండగా నిలిచారో పంచుకున్న విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 4, 2026, 12:08:42 IST
Advertisement

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే మనకు భారీ యాక్షన్ సినిమాలు, 'బీయింగ్ హ్యూమన్' సంస్థే గుర్తొస్తాయి. కానీ, ఎవరికి తెలియకుండా ఆయన చేసే కొన్ని పనులు మనుషుల ప్రాణాలను కాపాడుతాయని తాజాగా ఒక సంఘటన నిరూపించింది. మూడు సార్లు గుండె మార్పిడి (Heart Transplant) చేయించుకుని ప్రాణాలతో పోరాడి గెలిచిన రీనా రాజు అనే మహిళ.. సల్మాన్ ఖాన్ తన పట్ల చూపిన ఉదారతను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

సర్జరీకి ముందు ఆ రెండు గంటల ఫోన్ కాల్!

3 సార్లు గుండె మార్పిడి, సల్మాన్ ఖాన్‌తో రాత్రి 2 గంటల ఫోన్ కాల్- సర్జరీ విషయాలు గుర్తు చేసుకున్న ఫ్యాన్
3 సార్లు గుండె మార్పిడి, సల్మాన్ ఖాన్‌తో రాత్రి 2 గంటల ఫోన్ కాల్- సర్జరీ విషయాలు గుర్తు చేసుకున్న ఫ్యాన్

'వాయిస్ ఆఫ్ బెంగళూరు' పోడ్‌కాస్ట్‌లో ఆర్జే సౌజన్యతో మాట్లాడిన రీనా రాజు తన మొదటి గుండె మార్పిడి సర్జరీకి ముందు జరిగిన ఒక అద్భుతమైన విషయాన్ని వెల్లడించారు. "నేను సల్మాన్ సార్‌ను నా మూడు గుండెలతోనూ ప్రేమిస్తాను. మొదటి సర్జరీకి ముందు నాకు ఆయన నంబర్ దొరికింది" అని రీనా రాజు తెలిపారు.

"ఎంతో మంది ఆయన (సల్మాన్ ఖాన్)కు మెసేజ్ చేస్తుంటారు కదా అని అనుకున్నాను. కానీ, నేను గుండె మార్పిడికి సిద్ధమవుతున్నానని తెలిశాక, ఆస్ట్రేలియాలో షూటింగ్‌లో ఉన్న ఆయన నాకు స్వయంగా ఫోన్ చేశారు" అని రీనా రాజు పేర్కొన్నారు.

సర్జరీ జరగడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి సల్మాన్ ఖాన్ ఆమెతో దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారట. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడమే కాకుండా, రీనాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారట. ఆ మాటలే తనకు మళ్లీ ప్రాణం పోశాయని రీనా రాజు చెప్పుకొచ్చారు.

గుర్తుపెట్టుకుని మరీ సైకిల్ గిఫ్ట్!

రెండోసారి సర్జరీ జరిగిన తర్వాత 2018లో ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం 'గెలాక్సీ అపార్ట్‌మెంట్స్'లో ఆయనను రీనా కలిశారు. "ఆ రాత్రంతా మేము కలిసి పార్టీ చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం. ఆ తర్వాత నన్ను 'రేస్ 3' సెట్స్‌కు కూడా తీసుకెళ్లారు. ఎప్పుడో చాలా కాలం క్రితం నాకు వైట్ సైకిల్ అంటే ఇష్టమని ఆయనకు మెసేజ్ చేశాను. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మరీ నాకు ఒక 'బీయింగ్ హ్యూమన్' వైట్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆయన మనసంతా మంచితనమే నిండి ఉంటుంది" అని రీనా రాజు కొనియాడారు.

సల్మాన్ తదుపరి చిత్రాల అప్‌డేట్స్

మాతృభూమి (Maatrubhumi): అపూర్వ లఖియా దర్శకత్వంలో వస్తున్న ఈ వార్ డ్రామాలో సల్మాన్ ఇండియన్ ఆర్మీ కల్నల్‌గా కనిపిస్తారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి పోరాడే ఒక వీర గాథగా ఇది తెరకెక్కుతోంది. ఏప్రిల్ 17న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారు.

వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్: తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఒక భారీ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దిల్ రాజుతో సల్మాన్‌కు ఇది మొదటి సినిమా కావడం విశేషం.

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, ఒక సామాన్య అభిమాని ప్రాణం కోసం సమయం కేటాయించిన సల్మాన్ ఖాన్‌పై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks