బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యుద్ధ ప్రాతిపదికన సాగే యాక్షన్ డ్రామా 'మాతృభూమి' చుట్టూ గత కొన్నాళ్లుగా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా నుంచి చైనాకు సంబంధించిన ప్రస్తావనలను తొలగించారని, అందుకే థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా మాతృభూమి ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలవుతుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్కు చెందిన కీలక వ్యక్తులు స్పందించారు.
ఓటీటీ వార్తల్లో వాస్తవం లేదు
సల్మాన్ ఖాన్ తన సినిమాలను ఎప్పుడూ భారీ స్థాయిలో వెండితెరకు తగినట్టుగా నిర్మిస్తారని, మాతృభూమిని కూడా థియేటర్లలోనే విడుదల చేస్తామని సినిమా వర్గాలు స్పష్టం చేశాయి.
"సల్మాన్ ఇప్పటికీ మాస్ ఆడియన్స్కు ఫేవరెట్ మెగాస్టార్. ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా ఎంతో గ్రాండ్గా తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్న మాట నిజమే కానీ, వాటిని పరిష్కరించుకుని థియేటర్లలోనే వస్తాం" అని చిత్ర బృందానికి చెందిన ఒక సభ్యుడు పేర్కొన్నారు.
ఓటీటీలో కూడా సెన్సార్ తప్పదు
సాధారణంగా థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకే సెన్సార్ ఇబ్బందులు ఉంటాయని, ఓటీటీలో విడుదల చేస్తే అలాంటి సమస్యలు ఉండవనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిపై ఇండస్ట్రీ విశ్లేషకులు స్పందిస్తూ.. "ఒక చిత్రం నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వెళ్లినా సరే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్టిఫికేషన్ ప్రక్రియను దాటాల్సిందే. ఓటీటీలో కూడా విచ్చలవిడిగా ప్రదర్శించే అవకాశం ఉండదు. కాబట్టి సెన్సార్ భయంతో ఓటీటీకి వెళ్తున్నారన్న వాదనలో నిజం లేదు" అని విశ్లేషిస్తున్నారు.
'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' నుంచి 'మాతృభూమి'గా..
గతంలో ఈ సినిమాకు 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' అనే పేరు ఉండేది. 2020లో తూర్పు లడఖ్లోని గాల్వన్ వ్యాలీలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే చైనా ప్రభుత్వ మీడియా నుంచి వ్యతిరేకత రావడం, మరికొన్ని దౌత్యపరమైన కారణాల వల్ల మేకర్స్ ఈ సినిమాను పూర్తిగా రీషూట్ చేసినట్లు తెలుస్తోంది.
{{/usCountry}}గతంలో ఈ సినిమాకు 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' అనే పేరు ఉండేది. 2020లో తూర్పు లడఖ్లోని గాల్వన్ వ్యాలీలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే చైనా ప్రభుత్వ మీడియా నుంచి వ్యతిరేకత రావడం, మరికొన్ని దౌత్యపరమైన కారణాల వల్ల మేకర్స్ ఈ సినిమాను పూర్తిగా రీషూట్ చేసినట్లు తెలుస్తోంది.
{{/usCountry}}దాంతో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమా పేరును 'మాతృభూమి'గా మార్చడమే కాకుండా, చైనా ప్రస్తావన లేకుండా కేవలం భారత సైనికుల ధైర్యసాహసాలను చూపించేలా మార్పులు చేసినట్లు సమాచారం.
మాతృభూమి రిలీజ్ డేట్
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఇండియన్ ఆర్మీ కల్నల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన సరసన హీరోయిన్ చిత్రాంగద సింగ్ నటిస్తోంది. ఒక పక్క దేశభక్తి, మరోపక్క భావోద్వేగమైన కుటుంబ అనుబంధాల కలయికగా ఈ చిత్రం రూపొందింది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్పై సల్మా ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మాతృభూమి మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉంది.