పెళ్లి తర్వాత తొలిసారి-పబ్లిక్ గా కలిసి కనిపించిన కొత్త దంపతులు సమంత, రాజ్-ఫొటోలు వైరల్

సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మొదటిసారి పబ్లిక్ గా కనిపించారు. ఈ జంట ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Published on: Dec 13, 2025 9:54 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత తొలిసారి బయట జంటగా కనిపించారు. వీళ్లు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన ఒక సన్నిహిత వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత నూతన వధూవరులు ఇటీవల ముంబైకి చేరుకున్నప్పుడు మొదటిసారి కలిసి కనిపించారు.

రాజ్ నిడిమోరు, సమంత
రాజ్ నిడిమోరు, సమంత

జోడీగా సమంత, రాజ్

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత మొదటసారి జంటగా కనిపించిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. వీళ్లు ముంబై విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్నప్పుడు కలిసి కనిపించారు. ఇద్దరూ సాధారణ దుస్తుల్లో ఉన్నారు. సమంత ఒక గ్రే స్వెటర్, నల్ల ప్యాంట్లలో స్టైలిష్‌గా కనిపించగా, రాజ్ నిడిమోరు సముద్రపు ఆకుపచ్చ టీ-షర్ట్, బ్లూ జీన్స్, బ్లాక్ డెనిమ్ జాకెట్‌లో కనిపించాడు. ఫోటోగ్రాఫర్లు వారిని క్లిక్ చేస్తున్నప్పుడు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపారు తమ కారు వైపు వెళుతున్నప్పుడు సమంత నవ్వు ఆపలేకపోయింది.

సమంత పెళ్లి

డిసెంబర్ 1న సమంత, రాజ్ తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌తో ఈ వార్తను ధృవీకరించారు. వారు కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో లింగ భైరవ వివాహం చేసుకున్నారు. గతంలో నాగ చైతన్యను సమంత వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంట 2017 నుండి 2021 వరకు కలిసి ఉంది. ఆ తర్వాత విడిపోయారు. మరోవైపు రాజ్ 2015లో శ్యామలి దేను వివాహం చేసుకున్నారు. వారు 2022లో విడిపోయారు.

డేటింగ్ లో ఉన్నారని

2024లో సమంత, రాజ్ సంబంధంపై పుకార్లు మొదలయ్యాయి. వారు బహిరంగ కార్యక్రమాలలో కలిసి కనిపించారు. అలాగే కలిసి జీవిస్తున్నారని, డేటింగ్ చేస్తున్నారనే నివేదికలు కూడా ఉన్నాయి. ఇద్దరూ తమ సంబంధం గురించి మౌనంగా ఉన్నప్పటికీ, సమంత తరచుగా తన సోషల్ మీడియా పోస్ట్‌లలో రాజ్‌ను చేర్చింది. ఇది ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

సమంత, రాజ్ ఫస్ట్ హిట్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 సెట్స్‌లో కలుసుకున్నారు. అక్కడ సమంత.. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. దీని తరువాత వారు అమెరికన్ సిరీస్ 'సిటాడెల్' భారతీయ అనుసరణ 'సిటాడెల్: హనీ బన్నీ'లో కలిసి పనిచేశారు. సమంత తదుపరి 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'లో కనిపించనుంది. ఇది రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన మరో హై-ఆక్టేన్ సిరీస్. ఈ షోలో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వమీకా గబ్బి, జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు. ఇది 2026లో విడుదల అవుతుందని భావిస్తున్నారు.