సిన్సియర్ ఉద్యోగి-డ‌బ్బు పిచ్చి పెళ్లాం-రౌడీ కొడుకు-ఓటీటీలోకి డైరెక్ట్‌గా క్రైమ్ థ్రిల్ల‌ర్‌-ఇంట్రెస్టింగ్‌గా ట్రైల‌ర్‌

ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ నేరుగా వచ్చేస్తోంది. శివాజీ, లయ జంటగా నటించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఇవాళ రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది.  

Feb 7, 2026, 17:33:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. శివాజీ, లయ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ (ఫిబ్రవరి 7) రిలీజ్ చేశారు. చీఫ్ గెస్ట్ గా అనిల్ రావిపూడి అటెండ్ అయ్యి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ (x/etvwin)
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ (x/etvwin)

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ

తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇది ఫిబ్రవరి 12న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ కానుంది. ఈ మూవీకి సుధీర్ శ్రీరామ్ డైరెక్టర్. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పై శివాజీ సొంటినేని నిర్మించారు. ఈ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాలో శివాజీ, లయ, అలీ, ధన్ రాజ్, ప్రిన్స్, చంద్ర, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కరణ్ తదితరులు నటిస్తున్నారు.

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ఇందులో సిన్సియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్ గా శివాజీ నటించారు. పనిలో ఎంతో నిజాయతీతో ఉంటాడు. దొంగ సంతకాలు అస్సలు చేయడు. కానీ అతని భార్య ఉత్తర (లయ)కు మనీ మీద ఆశ ఎక్కువ. భర్తను లంచం తీసుకోమ్మని బలవంతం చేస్తుంటుంది.

రౌడీ కొడుకు

శ్రీరామ్, ఉత్తరకు ఓ రౌడీ కొడుకు ఉంటాడు. ఊర్లో గొడవలు చేస్తుంటాడు. తన అల్లరితో తండ్రికి తలనొప్పి తెప్పిస్తుంటాడు. ఇలా వీళ్ల లైఫ్ సాఫీగా సాగిపోతుంది. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే అంటూ వచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ‘వాడు నువ్వు అనుకున్నంత సుద్దపూస ఏం కాదు’ అని ఇమ్మాన్యుయేల్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మలుపు తీసుకుంటుంది.

హత్య కేసు

శ్రీరామ్ ఫ్యామిలీ కలిసి ఎవరినో హత్య చేసినట్లు చూపించారు. ఈ శవాన్ని మాయం చేయడానికి వీళ్లు నానా తంటాలు పడతారు. ఇవన్నీ ఫన్నీగా ఉన్నాయి. ఇక అలీ, ధన్ రాజ్, ఇమ్మాన్యుయేల్, చంద్రతో కామెడీ పండినట్లే కనిపిస్తోంది. ‘ఒక ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మిమ్మల్ని చూసిన తర్వాతే తెలిసింది’ అని అలీ డైలాగ్ ఉంటుంది.

హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అఫీసర్ గా ప్రిన్స్ నటించాడు. తర్వాత కథ అంతా హత్య ఇన్వెస్టిగేషన్, అందులో శ్రీరామ్ పాత్ర గురించే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓటీటీ ఆడియన్స్ కోసం ఓ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.