ధనుష్ ఈ నెలలో తన తదుపరి చిత్రం 'తేరే ఇష్క్ మే' విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘రాంఝానా’, 'అత్రంగి రే' తర్వాత దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్తో కలిసి ధనుష్ చేసిన రొమాంటిక్ డ్రామా చిత్రం ఇది. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (నవంబర్ 14) విడుదలైంది. దీనికి అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు.
సందీప్ రెడ్డి పోస్ట్

తేరే ఇష్క్ మే ట్రైలర్ పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఆయన పోస్టు తెగ చక్కర్లు కొడుతోంది. సందీప్ తన ఎక్స్ ఖాతాలో చిత్ర ట్రైలర్ను పంచుకున్నారు. క్యాప్షన్లో ఇలా రాసుకొచ్చాడు. "ఉద్వేగభరితమైనది!!! ధనుష్ తన సింహాసనాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు అనిపిస్తుంది.. అభినందనలు’’ అని సందీప్ పేర్కొన్నాడు. ఈ మూవీతో ధనుష్ తన సింహాసనాన్ని తిరిగి దక్కించుకున్నట్లే ఉందనే సందీప్ కామెంట్ ఫ్యాన్స్ కు తెగ ఆనందాన్ని కలిగిస్తోంది.
పాపులర్ క్యారెక్టర్లు
ధనుష్ తెరపై బలమైన, ఉద్వేగభరితమైన పాత్రలను పోషించడానికి ప్రసిద్ధి చెందాడు. అతని అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో కొన్ని 'వడ చెన్నై', 'అసురన్', ‘కర్ణన్’, 'ఆడుకాలం'. బాలీవుడ్లో అతని తొలి చిత్రం 'రాంఝానా'లో కూడా అతను ఒక ఉద్వేగభరితమైన పాత్రతో పాపులర్ అయ్యాడు.
తేరే ఇష్క్ మే గురించి..
{{/usCountry}}ధనుష్ తెరపై బలమైన, ఉద్వేగభరితమైన పాత్రలను పోషించడానికి ప్రసిద్ధి చెందాడు. అతని అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో కొన్ని 'వడ చెన్నై', 'అసురన్', ‘కర్ణన్’, 'ఆడుకాలం'. బాలీవుడ్లో అతని తొలి చిత్రం 'రాంఝానా'లో కూడా అతను ఒక ఉద్వేగభరితమైన పాత్రతో పాపులర్ అయ్యాడు.
తేరే ఇష్క్ మే గురించి..
{{/usCountry}}కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమాలో ధనుష్ వైవిధ్యమైన క్యారెక్టర్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. అతను ముక్తి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వారి ప్రేమ కళాశాల కారిడార్లలో, బైక్ రైడ్లలో కనిపిస్తుంది. కానీ ఆమె మనసు మార్చుకుని, మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఎంచుకుంటుంది. మోసపోయిన అతను ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తాడు. మొత్తం ఢిల్లీని బూడిద చేయాలని ప్రతిజ్ఞ చేస్తాడు.
ప్రేమ కోల్పోతుంది, జీవితాలు నాశనం అవుతాయి. ఈ గందరగోళం మధ్యలో అతను పైలట్ అవుతాడు. ఆమె మద్యానికి బానిస అవుతుంది. తేరే ఇష్క్ మే నవంబర్ 28న థియేటర్లలో విడుదల అవుతుంది. ఇది ధనుష్, కృతి సనన్ లు కలిసి నటించిన మొదటి సినిమా.
స్పిరిట్ తో
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు స్పిరిట్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో ప్రభాస్ హీరో. ఇంకా దీని షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇందులో ప్రకాష్ రాజ్, త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్ తదితరులు నటిస్తున్నారు. సందీప్ డైరెక్షన్ లో చివరిగా యానిమల్ మూవీ వచ్చింది.