Senior Actress Aasha Singh Jaiswal Passed Away: సినీ లోకంలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. భారతీయ బుల్లితెర, సినీ రంగానికి చెందిన సీనియర్ నటి, ప్రముఖ మహిళా మిమిక్రీ ఆర్టిస్ట్ ఆశా సింగ్ జైస్వాల్ (Aasha Singh Jaiswal) ముంబైలో తుదిశ్వాస విడిచారు.
ఆశా సింగ్ జైస్వాల్ అంత్యక్రియలు

ఆగస్టు 22న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూసినట్లు ఆమె కుమారుడు ఆకాష్ భరద్వాజ్ ధ్రువీకరించారు. మరుసటి రోజు ఉదయం ముంబై విలే పార్లే వెస్ట్లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆశా సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
'ఐరన్ లేడీ'కి కుమారుడి భావోద్వేగ నివాళి
అమ్మ మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఆకాష్ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తల్లికి నివాళులర్పించారు. ఆమెను ఒక శక్తివంతమైన మహిళగా (Iron Lady) వర్ణిస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
నటన మాత్రమే సర్వస్వం
"మా అమ్మ నిరంతరం శ్రమించే ఒక 'ఐరన్ లేడీ'. ఆశా సింగ్ జైస్వాల్ ఆత్మశాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఆశా సింగ్ జైస్వాల్ చేసిన అద్భుతమైన పాత్రలను, నటనను సోషల్ మీడియాలో చూస్తూ ఆమెను గుర్తుంచుకోండి. ఆత్మ ఎక్కడ ఉన్నా మీ అభిమానాన్ని చూసి సంతోషిస్తుంది. ఆమె జీవితంలో నటన, పని మాత్రమే సర్వస్వం" అని ఆకాష్ భరద్వాజ్ పేర్కొన్నారు.
ఆమె కళను గుర్తు చేసుకోవటమే అసలైన నివాళి
మరణం గురించి బాధపడటం కాకుండా, ఆమె అందించిన కళను గుర్తు చేసుకుంటూ ఆనందించడమే అమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆకాష్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. తెలుగుతో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన బి.ఆర్. చోప్రా పౌరాణిక ధారావాహిక 'మహాభారత్' లో కృపాచార్యుడి సోదరి 'కృపి' పాత్రలో ఆశా సింగ్ జైస్వాల్ చూపిన అభినయం ఆకట్టుకుంది.
సీరియల్స్, సినిమాల్లో కీలక పాత్రలు
ఆ సీరియల్ తెచ్చిపెట్టిన గుర్తింపుతో ఆశా సింగ్కు బాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. షారుఖ్ ఖాన్ నటనకు మైలురాయిగా నిలిచిన 'బాజీగర్' చిత్రంతో పాటు బొబ్బి జాసూస్, దీవాంగి, ఆగ్, కాయదా కానూన్, ఆన్సూ బనే అంగారే, ఘర్ బాజార్ వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశారు.
మిమిక్రీ రంగంలో అరుదైన రికార్డు
{{/usCountry}}ఆ సీరియల్ తెచ్చిపెట్టిన గుర్తింపుతో ఆశా సింగ్కు బాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. షారుఖ్ ఖాన్ నటనకు మైలురాయిగా నిలిచిన 'బాజీగర్' చిత్రంతో పాటు బొబ్బి జాసూస్, దీవాంగి, ఆగ్, కాయదా కానూన్, ఆన్సూ బనే అంగారే, ఘర్ బాజార్ వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశారు.
మిమిక్రీ రంగంలో అరుదైన రికార్డు
{{/usCountry}}కేవలం నటనకే పరిమితం కాకుండా, మహిళా మిమిక్రీ ఆర్టిస్టుగా ఆశా సింగ్ రికార్డు సృష్టించారు. ఆ రోజుల్లో పురుషులదే హవాగా ఉన్న మిమిక్రీ రంగంలోకి అడుగుపెట్టి, దిగ్గజ నటి మీనా కుమారి గొంతును యథాతథంగా అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేవారు.
సామాజిక సేవా కార్యక్రమాలు కూడా
వేదికలపై ఆశా సింగ్ జైస్వాల్ ఇచ్చిన ప్రత్యక్ష ప్రదర్శనలకు విశేష ఆదరణ లభించేది. కళాసేవతో పాటు 'ఆశా ఈవెంట్స్ అండ్ ఫిల్మ్స్' సంస్థను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ఆశా సింగ్ జైస్వాల్ మృతికి పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.