Serial Actress Shilpa Shinde On TV Producers: ముంబై టెలివిజన్ పరిశ్రమలో మరోసారి పారితోషికాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. నటుడు షెహజాదా ధామికి రావాల్సిన రూ. 30 లక్షల బాకీని నిర్మాతలు ఇవ్వడం లేదనే వార్తలపై ‘భాబీజీ ఘర్ పర్ హై’ సీరియల్ హీరోయిన్ శిల్పా షిండే ఘాటుగా స్పందించారు.
వైట్ కాలర్ మాఫియాల

బుల్లితెరను శాసిస్తున్న కొందరు నిర్మాతలు ‘వైట్ కాలర్ మాఫియా’లా వ్యవహరిస్తున్నారంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించారు బుల్లితెర హీరోయిన్ శిల్పా షిండే.
సాధారణంగా టీవీ సీరియళ్లలో నటించే ఆర్టిస్టులకు మూడు నెలల (90 రోజులు) తర్వాతే పారితోషికాలు ఇచ్చే నిబంధన ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్మాతలు నటీనటులను లొంగదీసుకుంటున్నారని, ప్రశ్నిస్తే భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని శిల్పా ఆరోపించారు.
ఆ దౌర్భాగ్యుల దగ్గర పనిచేయను.. కూరగాయలు అమ్ముకుంటా!
"టీవీ ఇండస్ట్రీలో ఇప్పుడు క్రియేటివిటీ అనేది పూర్తిగా నశించింది. అంతా చెత్త షోలు తీస్తున్నారు. ఇలాంటి గతిమాలిన వాతావరణంలో, ఆ దౌర్భాగ్యుల దగ్గర అవకాశాల కోసం నేను చేతులు కట్టేసుకోను. దానికంటే రోడ్డుపై కూరగాయలు అమ్ముకోవడానికైనా సిద్ధమే కానీ, లొంగిపోయే ప్రసక్తే లేదు" అని శిల్పా షిండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టిస్ట్ అసోసియేషన్లు కూడా నిర్మాతలకు కొమ్ముకాస్తున్నాయే తప్ప కష్టాల్లో ఉన్న నటీనటులకు అండగా నిలవడం లేదని విమర్శించారు. కొందరు నటులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి ఈ ఆర్థిక వేధింపుల వ్యవస్థే కారణమని శిల్పా షిండే ఆవేదన వ్యక్తం చేశారు.
పాత కేసుపై ట్రోల్స్.. సహనటులపై ఆగ్రహం
పదేళ్ల క్రితం ‘భాబీజీ ఘర్ పర్ హై’ సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లీపై తాను పెట్టిన లైంగిక వేధింపుల కేసు కేవలం డబ్బుల కోసమేనంటూ వస్తున్న విమర్శలపై శిల్పా కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో తాను ఎలాంటి మానసిక క్షోభ అనుభవించానో బయట ఉన్నవారికి తెలియదన్నారు. కష్టకాలంలో తనతో కలిసి పనిచేసిన సహనటులు ఎవరూ అండగా నిలబడలేదని మండిపడ్డారు.
{{/usCountry}}పదేళ్ల క్రితం ‘భాబీజీ ఘర్ పర్ హై’ సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లీపై తాను పెట్టిన లైంగిక వేధింపుల కేసు కేవలం డబ్బుల కోసమేనంటూ వస్తున్న విమర్శలపై శిల్పా కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో తాను ఎలాంటి మానసిక క్షోభ అనుభవించానో బయట ఉన్నవారికి తెలియదన్నారు. కష్టకాలంలో తనతో కలిసి పనిచేసిన సహనటులు ఎవరూ అండగా నిలబడలేదని మండిపడ్డారు.
{{/usCountry}}నాటి వివాదంలో తాను ఒంటరిగా పోరాడాల్సి వచ్చిందని, ఇప్పటికీ ఇండస్ట్రీలో అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేశారు. తన అంతరాత్మకు ఏం జరిగిందో తెలుసని, వేరెవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
సంచలనం రేపిన ‘నకిలీ కేసు’ అంగీకారం
ఇటీవలే భారతీ సింగ్, హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న ఒక పాడ్కాస్ట్లో శిల్పా షిండే చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని కుదిపేశాయి. పదేళ్ల క్రితం నిర్మాత సంజయ్ కోహ్లీ తన పారితోషికం ఇవ్వకుండా వేధించడంతో, అతడిని దారికి తెచ్చుకోవడానికి చివరి అస్త్రంగా ‘ఫేక్ లైంగిక వేధింపుల కేసు’ పెట్టానని ఆమెనే స్వయంగా అంగీకరించారు.
ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ జరిగి తన డబ్బులు అందాయని వెల్లడించారు శిల్పా షిండే. అయితే, లైంగిక వేధింపుల చట్టాన్ని వ్యక్తిగత కక్షల కోసం వాడుకున్నారంటూ తోటి నటీమణులు హీనా ఖాన్, పూజా బేడీలు శిల్ప తీరును తీవ్రంగా ఖండించారు.
తప్పుడు ఆరోపణల వల్ల
అటు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) కూడా శిల్పా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల భవిష్యత్తులో నిజంగా బాధితులైన మహిళలకు న్యాయం జరగకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదం బాలీవుడ్, బుల్లితెర వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.