Serial Actress Shubhangi Atre On Harassment: హిందీ బుల్లితెరపై 'అంగూరీ భాబీ'గా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన సీరియల్ హీరోయిన్ శుభాంగి ఆత్రే తెరపై ఎంతో నవ్వుతూ, సరదాగా కనిపిస్తారు. కానీ, ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక చేదు జ్ఞాపకం, ఇప్పటికీ గగుర్పాటుకు గురిచేసే భయంకరమైన అనుభవం ఉంది.
గోడలపైనా, రోడ్లపైనా పేర్లు రాస్తూ భయాందోళనలు

'హాటర్ ఫ్లై' నిర్వహించిన 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమంలో పాల్గొన్న శుభాంగి ఆత్రే తన స్కూల్ డేస్లో ఎదురైన ఒక వేధింపుల సంఘటనను బయటపెట్టారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగిందని శుభాంగి చెప్పారు. ఒక వ్యక్తి తనను నిరంతరం వెంటాడుతూ, మానసికంగా వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.
భయానకమైన ఘట్టం
"నా జీవితంలో అత్యంత భయానకమైన ఘట్టం అది. ఆ సమయంలో ఒక వ్యక్తి రోడ్లపైనా, పరిసరాల్లోని భవనాలపైనా నా పేరు, తన పేరు కలిపి రాసేవాడు. ఎంతలా అంటే.. మేము ఇంటి తలుపు తెరవగానే ఎదురుగా ఉండే గోడపై ఆ పేర్లే కనిపిచేవి. నిత్యం బైక్పై నన్ను అనుసరిస్తూ చుట్టూ తిరిగేవాడు" అని ఆనాటి సంఘటనను శుభాంగి గుర్తుచేసుకున్నారు.
రక్షణ లేని వాతావరణం.. కుటుంబంలో ఆందోళన
ఆ ఆకతాయి ఆగడాలు మితిమీరడంతో శుభాంగి కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆడపిల్లలపై జరుగుతున్న దాడుల వార్తలు వింటున్న రోజుల్లో, దారికాచే ఆకతాయిల వల్ల తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఒకరోజు ఆమె సోదరి ధైర్యంచేసి ఆ వేధింపులకి అడ్డుకట్ట వేసింది.
బుద్ధి చెప్పిన అక్క
"ఇలాంటి పనుల వల్ల ఏమీ సాధించలేవు. ముందు జీవితంలో ఒక స్థాయికి చేరుకో, ఆ తర్వాత వచ్చి మాట్లాడు" అని తన అక్క ఆ ఆకతాయికి గట్టిగా బుద్ధి చెప్పినట్లు టీవీ నటి శుభాంగి ఆత్రే తెలిపారు.
ఇళ్లకే పరిమితమైపోయే ప్రమాదం
{{/usCountry}}"ఇలాంటి పనుల వల్ల ఏమీ సాధించలేవు. ముందు జీవితంలో ఒక స్థాయికి చేరుకో, ఆ తర్వాత వచ్చి మాట్లాడు" అని తన అక్క ఆ ఆకతాయికి గట్టిగా బుద్ధి చెప్పినట్లు టీవీ నటి శుభాంగి ఆత్రే తెలిపారు.
ఇళ్లకే పరిమితమైపోయే ప్రమాదం
{{/usCountry}}ఇలాంటి సంఘటనల వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన యువతులు బయటకు రావడానికి భయపడి, ఇళ్లకే పరిమితమైపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. వేధింపులపై మహిళలు, యువతులు మౌనంగా ఉండకుండా గొంతు విప్పాలని, నేటి తరం అమ్మాయిలు తమ రక్షణ విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించడం మంచి పరిణామమని శుభాంగి అభిప్రాయపడ్డారు.
కస్తూరి నుంచి అంగూరీ భాబీ వరకు.. ప్రతిభతో గుర్తింపు
'కసౌటీ జిందగీ కే' సీరియల్తో నటనను ప్రారంభించిన శుభాంగి, ఏక్తా కపూర్ నిర్మించిన 'కస్తూరి' ధారావాహికతో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2007 నుంచి 2009 వరకు సాగిన ఈ సీరియల్ ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 2016లో 'భాబీజీ ఘర్ పర్ హై' సీరియల్లోకి ప్రవేశించి, అంగూరీ భాబీ పాత్రతో తనదైన అమాయకత్వంతో, ప్రత్యేకమైన సంభాషణ శైలితో ప్రతి ఇంటా పరిచయమై ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
శుభాంగి ఆత్రే ఇతర సీరియల్స్
'చిడియా ఘర్', 'అధూరీ కహానీ హమారీ', 'హవన్' వంటి అనేక ఇతర ప్రముఖ సీరియళ్లలోనూ శుభాంగి ఆత్రే తనదైన ముద్ర వేశారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను దాటుకుని, స్వశక్తితో బుల్లితెరపై చెరగని స్థానాన్ని సంపాదించుకున్న శుభాంగి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.