Shah Rukh Khan About Oscars Instagram Post: సినిమా ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే అస్కార్ అవార్డులను అందించే 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్', తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'ఓం శాంతి ఓం' క్లిప్ను పోస్ట్ చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్ అవార్డు అందుకున్న తర్వాత చెప్పే సుప్రసిద్ధ డైలాగ్ ఉంది.
మనకు దక్కేలా కుట్ర చేస్తుంది

"ఒక విషయాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఈ సృష్టి మొత్తం అది మనకు దక్కేలా కుట్ర చేస్తుంది" అనే అర్థం వచ్చేలా ఉన్న హిందీ డైలాగ్ను షారుఖ్ ఖాన్ చెప్పాడు. దాన్ని అకాడమీ షేర్ చేస్తూ, "విధి అనేది ఎప్పుడూ గురి తప్పదు" అని క్యాప్షన్ ఇచ్చింది.
దీనిపై షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. ఆ పోస్ట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. "మరోసారి నన్ను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను నిజంగా ఈ ప్రపంచానికే రాజులా (King of the World) ఫీలవుతున్నాను" అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఫరా ఖాన్ రియాక్షన్: "పిక్చర్ అభి బాకీ హై"
ఓం శాంతి ఓం దర్శకురాలు ఫరా ఖాన్ కూడా ఈ అరుదైన గౌరవం పట్ల స్పందించారు. ఈ పోస్ట్ను తనకు పంపిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూనే, సినిమాలోని తన ఫేవరెట్ డైలాగ్ "పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్" అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు ఫరా ఖాన్.
2007లో విడుదలైన 'ఓం శాంతి ఓం' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, దీపికా పదుకొణెను వెండితెరకు పరిచయం చేసింది. పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ కథ ఇప్పటికీ ప్రేక్షకులకు ఆల్టైమ్ ఫేవరెట్.
కింగ్ ఖాన్ తదుపరి ప్రయాణం.. కూతురితో కలిసి!
{{/usCountry}}2007లో విడుదలైన 'ఓం శాంతి ఓం' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, దీపికా పదుకొణెను వెండితెరకు పరిచయం చేసింది. పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ కథ ఇప్పటికీ ప్రేక్షకులకు ఆల్టైమ్ ఫేవరెట్.
కింగ్ ఖాన్ తదుపరి ప్రయాణం.. కూతురితో కలిసి!
{{/usCountry}}ఇదిలా ఉంటే, ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న 'కింగ్' సినిమాలో షారుఖ్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. షారుఖ్ తనయురాలు సుహానా ఖాన్ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం కానుంది. వీరికి తోడుగా అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.
మరోవైపు, హిట్ కాంబినేషన్ అయిన ఫరా ఖాన్ - షారుఖ్ ఖాన్ మళ్లీ జతకట్టబోతున్నారు. వీరిద్దరి కాంబోలో త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని వస్తున్న వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.