Shilpa Shetty: నా భార్యకు వాలెంటైన్స్ డే గిఫ్ట్ కింద ఆ ఐపీఎల్ టీమ్ కొన్నాను.. కానీ కేసు ఇప్పటికీ నడుస్తోంది: రాజ్ కుంద్ర
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమెకు వాలెంటైన్స్ గిఫ్ట్ ఇవ్వాలనే తాను 2009లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో తన వాటా రూ.82 కోట్లు పెట్టి కొన్నట్లు అతడు చెప్పడం విశేషం.
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కొనుగోలుకు సంబంధించి మైండ్ బ్లాకింగ్ విషయాలను బయటపెట్టారు. 2009లో శిల్పా శెట్టికి వాలెంటైన్స్ డే గిఫ్ట్గా ఇవ్వడానికే రూ. 81.9 కోట్లు (దాదాపు రూ. 82 కోట్లు) పెట్టి రాజస్థాన్ రాయల్స్ షేర్లు కొన్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాల్యుయేషన్ కథ: రూ. 700 కోట్ల నుంచి రూ. 16,000 కోట్లకు
ఇటీవల ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా ఐపీఎల్ బిజినెస్ సీక్రెట్స్ పంచుకున్నారు. తాను పెట్టుబడి పెట్టినప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ వాల్యుయేషన్ దాదాపు రూ. 700 కోట్లుగా ఉండేది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ మైండ్ బ్లాకింగ్ రీతిలో రూ. 16,000 కోట్లకు చేరుకుందని చెప్పారు. శిల్పా శెట్టికి ఉన్న బిగ్ క్రేజ్, బ్రాండ్ ఇమేజ్ చూసే తాను ఆ రోజు భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లు రాజ్ తెలిపారు.
వివాదాస్పద బెట్టింగ్ కేస్.. సరదాగా వేసిన పందెమే ముంచిందా?
2013లో ఐపీఎల్ లీగ్లో రేగిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ క్రికెట్ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ విచారణ తర్వాత, 2015లో రాజ్ కుంద్రాపై క్రికెట్ కార్యకలాపాల నుంచి లైఫ్టైమ్ బాన్ విధించారు. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ను రెండేళ్ల పాటు (2016, 2017) ఐపీఎల్ టోర్నీ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ వివాదంపై రాజ్ కుంద్రా స్పందిస్తూ.. తాము ఫ్రెండ్స్ మధ్య సరదాగా రూ. 500 బెట్ వేసుకున్నామని, దాన్ని బెట్టింగ్గా చిత్రీకరించి తనపై వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. "లైవ్ మ్యాచ్ చూస్తున్నప్పుడు పక్కన ఉన్నవారితో పందెం కాయడం చాలా మంది చేసేదే. 'రూ. 500 పందెం కాస్తావా?' అని సరదాగా అన్నందుకే నాపై లైఫ్ టైమ్ బ్యాన్ విధిస్తారా?" అని ఆయన ప్రశ్నించారు. ఈ కేస్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో విచారణలో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు ఎలా సంపాదిస్తున్నాయి?
ఐపీఎల్ బిజినెస్ మోడల్ గురించి రాజ్ కుంద్రా డీటైల్డ్గా వివరించారు. టోర్నమెంట్ ప్రారంభమైన మొదటి 5-6 ఏళ్లు ఫ్రాంచైజీ యజమానులకు ఎలాంటి ప్రాఫిట్స్ రాలేదన్నారు. అప్పట్లో టీమ్ను రన్ చేయడానికి ప్రతి ఏటా సొంత జేబు నుంచి డబ్బులు పెట్టాల్సి వచ్చేదని చెప్పారు.
అయితే ప్రస్తుతం ఐపీఎల్ ఓ బిగ్గెస్ట్ మనీ మేకింగ్ మెషిన్గా మారిందని ఆయన విశ్లేషించారు. ప్రతి ఫ్రాంచైజీకి ఏడాదికి రూ. 200 కోట్ల నుంచి రూ. 500 కోట్ల దాకా నెట్ ప్రాఫిట్ వస్తోందన్నారు. టీమ్స్ రాబడిలో 70 శాతం బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా వస్తే, మరో 10-15 శాతం జెర్సీ స్పాన్సర్షిప్లు, మిగిలిన 10-15 శాతం స్టేడియం టికెట్ల అమ్మకాల ద్వారా లభిస్తుందని ఐపీఎల్ ఫైనాన్షియల్ నెట్వర్క్ను డీకోడ్ చేశారు.
రాజ్ కుంద్రా వివాదాలు - కెరీర్ ట్రాక్
శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్న తర్వాత బిజినెస్ వరల్డ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్ కుంద్రా.. గతంలో అశ్లీల చిత్రాల నిర్మాణ ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత తన జైలు జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల ఆధారంగా 'UT69' అనే సినిమా తీసి నటుడిగా కూడా అలరించారు.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఐపీఎల్ తొలి సీజన్ (2008) విన్నర్గా నిలిచినా, ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకుని రెండేళ్లు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం రీ-ఎంట్రీ తర్వాత ఈ ఫ్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత సక్సెస్ ఫుల్, మోస్ట్ వాల్యుబుల్ టీమ్స్లో ఒకటిగా దూసుకుపోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


