...
...
Next Story

Kailash Kher: నేనేం జోకర్‌ను కాదు- స్టేజ్‌పైనే హోస్ట్‌కు చురకలంటించిన సింగర్ కైలాష్ ఖేర్- సచిన్‌ను అలా అడుగుతారా అంటూ!

Singer Kailash Kher Slams Host: బహిరంగ వేదికలపై గాయకులను 'రెండు లైన్లు పాడండి' అని అడగడం వారి గౌరవాన్ని తగ్గించడమేనని ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారులను వినోద వస్తువులుగా, జోకర్లుగా చూడవద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Published on: Apr 27, 2026, 22:30:52 IST
Advertisement

Singer Kailash Kher Slams Host: ఏదైనా అవార్డు వేడుక లేదా ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు హోస్ట్‌లు అక్కడికి వచ్చిన సింగర్లను సరదాగా రెండు పాటలు పాడమని అడగడం మనం నిత్యం చూస్తుంటాం. అయితే, ఈ సంప్రదాయంపై ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

హోస్ట్‌కు చురకలు

నేనేం జోకర్‌ను కాదు- స్టేజ్‌పైనే హోస్ట్‌కు చురకలంటించిన సింగర్ కైలాష్ ఖేర్- సచిన్‌ను అలా అడుగుతారా అంటూ!
నేనేం జోకర్‌ను కాదు- స్టేజ్‌పైనే హోస్ట్‌కు చురకలంటించిన సింగర్ కైలాష్ ఖేర్- సచిన్‌ను అలా అడుగుతారా అంటూ!

ఏప్రిల్ 25న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరిగిన 'సిక్స్ సిగ్మా లీడర్‌షిప్ సమ్మిట్'లో సింగర్ కైలాష్ ఖేర్ అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో వ్యాఖ్యాత (హోస్ట్) కైలాష్ ఖేర్‌ను 'రెండు లైన్లు పాడి వినిపించమని' కోరారు. దీనికి కైలాష్ ఖేర్ చాలా ఘాటుగా స్పందించారు.

"సంగీతాన్ని, గాయకులను ఇలా చూడకూడదు. 'రెండు లైన్లు పాడండి.. మూడ్ సెట్ చేయండి' అని అడగడం చాలా తప్పు. ఇలాంటి రిక్వెస్ట్‌లు అస్సలు చేయకండి. సమాజంలో ఈ ధోరణిని మార్చాలన్నదే నా తపన" అని ఆయన బహిరంగంగానే తేల్చి చెప్పారు.

"సచిన్‌ను సిక్స్ కొట్టమని అడుగుతారా?"

కళాకారుల పట్ల చూపే వివక్షను ఎండగడుతూ కైలాష్ ఖేర్ కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు ఇచ్చారు. "మీరు ఎప్పుడైనా సచిన్ టెండూల్కర్‌ను కలిసి.. 'సార్, ఇక్కడ ఒక సిక్స్ కొట్టి చూపించండి' అని అడుగుతారా? ఈ భూమ్మీద ఎవరూ అలా చేయరు" అని కైలాష్ ఖేర్ చెప్పారు.

"అలాగే ఒక ఆర్మీ జవాన్‌ను చూసి.. 'నీ పొజిషన్ తీసుకుని ఒక రౌండ్ కాల్పులు జరిపి చూపించు' అని అడగగలరా? మరి కళాకారుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? కళాకారులను క్లౌన్స్‌ (జోకర్లు) చేయకండి. ఒక సాధకుడిని కేవలం వినోదం పంచే వ్యక్తిగా కుదించవద్దు. కళాకారులు మనసు చెప్పినట్లు నడుచుకునే సాధకులు" అని సింగర్ కైలాష్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

"రెండు లైన్లు పాడటం వల్ల ఎదుటివారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తే అందులో తప్పేముంది?" అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.

మరోవైపు, "నిజమే.. ఒక కళాకారుడికి కూడా మూడ్, గౌరవం ఉంటాయి. వారు కోరుకున్నప్పుడే పాడాలి తప్ప, ఆర్డర్ చేసినట్లు అడగకూడదు" అని కైలాష్ ఖేర్ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.

జింగిల్స్ నుంచి 'బాహుబలి' వరకు..

ఇదిలా ఉంటే, కైలాష్ ఖేర్ ప్రస్థానం కోకాకోలా, పెప్సి వంటి బ్రాండ్ల జింగిల్స్‌తో మొదలైంది. 2003లో వచ్చిన 'అల్లా కే బందే' సాంగ్ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 'కైలాస' బ్యాండ్ ద్వారా 'తేరీ దీవానీ' వంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా కైలాష్ ఖేర్ సుపరిచితులే. ముఖ్యంగా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో 'ఎవడంటా ఎవడంటా', 'జయ జయకార' వంటి పాటలతో ఆయన గొంతు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కైలాష్ ఖేర్ హోస్ట్‌పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?

ఒక ఈవెంట్‌లో వ్యాఖ్యాత ఆయనను 'రెండు లైన్లు పాడండి' అని కోరడం తన వృత్తిని, గౌరవాన్ని తక్కువ చేయడమేనని భావించి కైలాష్ ఖేర్ అసహనం వ్యక్తం చేశారు.

2. కళాకారులను ఎవరితో పోల్చారు?

కళాకారులను సచిన్ టెండూల్కర్, ఆర్మీ జవాన్లతో పోల్చారు. మైదానం వెలుపల సచిన్‌ను సిక్స్ కొట్టమని ఎవరూ అడగరని, అలాగే కళాకారులను కూడా ఇష్టం వచ్చినప్పుడు పాడమని అడగకూడదని ఆయన వాదించారు.

3. కైలాష్ ఖేర్ పాడిన ప్రసిద్ధ పాటలు ఏవి?

ఆయన 'అల్లా కే బందే', 'తేరీ దీవానీ' వంటి హిందీ పాటలతో పాటు, తెలుగులో 'బాహుబలి' చిత్రంలోని 'ఎవడంటా ఎవడంటా', 'జయ జయకార' వంటి ప్రజాదరణ పొందిన పాటలు పాడారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe