తనను సుభా సియపోగు అనే న్యాయవాది వేధిస్తున్నానంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని పేర్కొన్నారు. రూ. 150 కోట్ల మోసం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.

న్యాయవాది సుభా సియపోగు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ. 150 కోట్లు మోసం చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని… ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా… కావాలనే తన పేరును ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు.
కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా… తనను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం కూడా జరిగిందని మంగ్లీ ఆరోపించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని భారీ కరెన్సీ నోట్ల కట్టలు ఉన్న ఒక వీడియోను చూపించి.. తనను బెదిరించారని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ తప్పుడు ప్రచారాలతో తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రతిష్టకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలోని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ వీడియో మూలాలు ఏమిటి…? 150 కోట్ల ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలేంటి..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సుభా సింగబోష్పై బీఎన్ఎస్ సెక్షన్లు 79, 351(3) కింద కేసు నమోదు చేశారు.
మంగ్లీపై కేసు..!
మరోవైపు సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు మోసం చేశారని లాయర్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}మరోవైపు సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు మోసం చేశారని లాయర్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ1 ఎవరనే విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు. కట్ చేస్తే… తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంగ్లీ ఫిర్యాదు చేయటం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల పూర్తిస్థాయి విచారణ తర్వాత….ఏం జరిగిందనేది బయటికి రానుంది.