టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్తో దూసుకుపోతున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ఏరియాల్లో ఒకటిగా పేరుగాంచిన వర్లీలో శ్రేయా ఘోషల్ రెండు ఖరీదైన ఫ్లాట్లను సొంతం చేసుకున్నారు.

రియల్ ఎస్టేట్ దిగ్గజం 'గోద్రెజ్ ప్రాపర్టీస్' నిర్మిస్తున్న 'గోద్రెజ్ ట్రైలాజీ' ప్రాజెక్టులో ఈ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026న ఈ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
కోట్లలో స్టాంప్ డ్యూటీ.. విలాసవంతమైన సౌకర్యాలు
మొదటి అపార్ట్మెంట్ వివరాల్లోకి వెళ్తే.. దీని కార్పెట్ ఏరియా సుమారు 2,430 చదరపు అడుగులు కాగా, మొత్తం ఏరియా 2,750 చదరపు అడుగులుగా ఉంది. ఈ ఒక్క ప్లాట్ కోసమే శ్రేయా కుటుంబం రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీని ప్రభుత్వానికి చెల్లించింది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు.
ఇక రెండో అపార్ట్మెంట్ సైతం దాదాపు 2,778 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంది. దీని విలువ కూడా సుమారు రూ. 30 కోట్లుగా రిజిస్ట్రేషన్ పత్రాలు చెబుతున్నాయి. ఈ రెండో ప్లాట్ కోసం రూ. 1.8 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 30 వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. అంటే కేవలం రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలోనే దాదాపు 3.6 కోట్లు ఖర్చు చేశారంటే ఈ ప్లాట్లు ఎంత ఖరీదైనవో అర్థం చేసుకోవచ్చు.
వర్లీ.. సెలబ్రిటీల చిరునామా
ముంబైలోని వర్లీ ప్రాంతం ఇప్పుడు సంపన్నులకు, సినీ సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. గతంలో దక్షిణ ముంబై, బాంద్రా ప్రాంతాలకు ఉన్న క్రేజ్ ఇప్పుడు వర్లీకి షిఫ్ట్ అయింది. ఇక్కడ చదరపు అడుగు ధర లక్ష రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధికంగా ఒక చదరపు అడుగుకు రూ. 2.80 లక్షల ధర పలికిన రికార్డు కూడా ఈ వర్లీలోని 'నమన్ జానా' భవనం పేరు మీద ఉండటం గమనార్హం.
అనరాక్ (ANAROCK) నివేదిక ప్రకారం, వర్లీలో నివసించడమంటే అది ఒక స్టేటస్ సింబల్. ఇక్కడ 2,000 నుంచి 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ప్లాట్లు సాధారణంగా రూ. 16 కోట్ల నుంచి రూ. 24 కోట్ల మధ్య పలుకుతుంటాయి. శ్రేయా ఘోషల్ కొనుగోలు చేసిన ప్లాట్లు ఈ రేంజ్ కంటే ఎక్కువే ఉండటం విశేషం.
పెరిగిన లగ్జరీ ఇళ్ల డిమాండ్
{{/usCountry}}అనరాక్ (ANAROCK) నివేదిక ప్రకారం, వర్లీలో నివసించడమంటే అది ఒక స్టేటస్ సింబల్. ఇక్కడ 2,000 నుంచి 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ప్లాట్లు సాధారణంగా రూ. 16 కోట్ల నుంచి రూ. 24 కోట్ల మధ్య పలుకుతుంటాయి. శ్రేయా ఘోషల్ కొనుగోలు చేసిన ప్లాట్లు ఈ రేంజ్ కంటే ఎక్కువే ఉండటం విశేషం.
పెరిగిన లగ్జరీ ఇళ్ల డిమాండ్
{{/usCountry}}దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్నప్పటికీ, ముంబైలో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ తగ్గడం లేదు. ఇటీవలే సింగర్ జుబిన్ నౌటియాల్ కూడా ముంబైలో రూ. 4.94 కోట్లతో ఒక ఇంటిని కొనుగోలు చేశారు.
కానీ, శ్రేయా ఘోషల్ ఏకంగా రూ. 60 కోట్లతో డీల్ కుదుర్చుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తన తల్లి శమిష్ఠ ఘోషల్, తండ్రి బిస్వజిత్ ఘోషల్తో కలిసి ఆమె ఈ నూతన గృహ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు.