sobhita dhulipala: దేవాలయాల మీద ఉండే శిల్పం ప్రాణం పోసుకుందా? దివి నుంచి దిగి వచ్చిన అప్సరస ర్యాంప్ పై నడిచిందా?.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ వీడియో చూస్తే ఇలాంటి ప్రశ్నలే కలుగుతున్నాయి. ర్యాంప్ పై అప్సరసలా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
షో స్టాపర్ గా శోభిత

ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే 'ఇండియా కౌచర్ వీక్' (FDCI India Couture Week) గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ప్యారిస్ కౌచర్ వీక్లో సంచలనం సృష్టించిన తన 'దేవి' (Devi) కలెక్షన్ను, దానికి తోడు సరికొత్త ఫెస్టివ్ కౌచర్ లైన్ను డిజైనర్ రాహుల్ మిశ్రా ఢిల్లీ వేదికగా ఆవిష్కరించారు. 'నెక్సస్ న్యూయార్క్' కొలాబరేషన్తో జరిగిన ఈ షోలో ప్రముఖ నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) షో స్టాపర్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
శోభిత విజువల్ వండర్
ర్యాంప్పై ఎంట్రీ ఇస్తూనే శోభిత ధూళిపాళ తన రాయల్ లుక్తో ఆకట్టుకుంది. ముందుగా ఐవరీ, షాంపైన్ టోన్లతో కూడిన ఎంబ్రాయిడరీ ప్యాంట్లు, చిన్న క్రిస్టల్ బీడ్వర్క్తో డిజైన్ చేసిన ఫిట్టెడ్ బోడిస్ను ధరించి అప్సరస విగ్రహంలా మెరిసిపోయింది.
ఆ తర్వాత అదే ర్యాంప్పై పూల ఆకృతులతో మెరిసే వాల్యూమినస్ లెహంగా స్కర్ట్ను ఆ ప్యాంట్పై ధరించి కౌచర్లోని సరికొత్త ప్రయోగాన్ని ప్రదర్శించింది. సెంటర్ పార్టెడ్ హెయిర్స్టైల్, డైమండ్ చోకర్తో శోభిత ధూళిపాళ ప్రదర్శించిన థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఫ్యాషన్ లవర్స్ను కట్టిపడేసింది.
వీడియో వైరల్
ర్యాంప్ పై దేవతా విగ్రహంలా నిలబడ్డ శోభిత ధూళిపాళ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ర్యాంప్ పై ఆమె నడక అచ్చం అప్సరసనే తలపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్ తో శోభిత తన సత్తాచాటిందని అందరూ అంటున్నారు.
అక్కినేని కోడలు
{{/usCountry}}ర్యాంప్ పై దేవతా విగ్రహంలా నిలబడ్డ శోభిత ధూళిపాళ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ర్యాంప్ పై ఆమె నడక అచ్చం అప్సరసనే తలపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్ తో శోభిత తన సత్తాచాటిందని అందరూ అంటున్నారు.
అక్కినేని కోడలు
{{/usCountry}}తెలుగు, హిందీ సినిమాల్లో యాక్టింగ్ తో అదరగొడుతున్న శోభిత ధూళిపాళ అక్కినేని కోడలిగా మారిన సంగతి తెలిసిందే. నాగ చైతన్యను ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె నటించిన సినిమా ‘చీకటిలో’ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో శోభిత ధూళిపాళ ఫ్యాన్స్ ను అలరించింది. మంకీ మ్యాన్ అని హాలీవుడ్ లోనూ ఓ ఫిల్మ్ చేసింది.