...
...
Next Story

శ్రీలీల నటించిన తమిళ పీరియడ్ పొలిటికల్ డ్రామా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి

శివకార్తికేయన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ పొలిటికల్ డ్రామా ‘పరశక్తి’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జీ5 వేదికగా ఫిబ్రవరి 7 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Published on: Jan 30, 2026, 14:21:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

శ్రీలీల నటించిన తమిళ పీరియాడికల్ పొలిటికల్ డ్రామా పరాశక్తి. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా ఇది. ఈ ‘పరాశక్తి’ తెలుగులోనూ రిలీజైనా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది జనవరి 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.

పరాశక్తి ఓటీటీ రిలీజ్ వివరాలు

శ్రీలీల నటించిన తమిళ పీరియడ్ పొలిటికల్ డ్రామా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి
శ్రీలీల నటించిన తమిళ పీరియడ్ పొలిటికల్ డ్రామా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి

శివకార్తికేయన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో నటించిన మూవీ పరాశక్తి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతికి ముందు రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. పరాశక్తి మూవీని ఫిబ్రవరి 7 నుంచి జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

తమిళంతోపాటు తెలుగులోనూ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు తెలుగులో అసలు ఆదరణ దక్కలేదు.

పరాశక్తి మూవీ స్టోరీ, ఇతర వివరాలు

సుధ కొంగర డైరెక్షన్ లో వచ్చిన సినిమా పరాశక్తి. ఇది 1950ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో సాగే కథ. కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో జరిగిన విద్యార్థి ఉద్యమాలు, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. నిజ జీవిత సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను రాసుకున్నారు.

ఈ మూవీలో రవి మోహన్ విలన్ పాత్రలో నటించగా, శ్రీలీల హీరోయిన్‌గా తమిళంలో అరంగేట్రం చేసింది. అథర్వ సహాయక పాత్రలో కనిపించగా, రానా దగ్గుబాటి, బేసిల్ జోసెఫ్, ధనంజయ్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఇది శివకార్తికేయన్‌కు 25వ సినిమా కాగా, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు ఇది 100వ సినిమా కావడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe