...
...
Next Story

ఈ రెండు స్టార్ మా సీరియల్స్ టైమింగ్స్ మారిపోయాయి.. కొత్త టెలికాస్ట్ టైమ్ వెల్లడించిన ఛానెల్

స్టార్ మాలో వచ్చే రెండు టాప్ సీరియల్స్ టైమింగ్స్ మారిపోయాయి. సోమవారం (ఫిబ్రవరి 16) నుంచే కొత్త టైమింగ్స్ లో ఇవి టెలికాస్ట్ అవుతున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. మరి ఆ సీరియల్స్ ఏవి? ఎప్పుడు చూడాలో తెలుసుకోండి.

Published on: Feb 16, 2026, 21:13:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

స్టార్ మా ఛానెల్లో వచ్చే రెండు పాపులర్ సీరియల్స్ చిన్ని, నువ్వు లేక నేను లేను టెలికాస్ట్ అయ్యే టైమింగ్స్ మారిపోయినట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. ఈ విషయాన్ని స్టార్ మా సోమవారం (ఫిబ్రవరి 16) తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది. వీటి కొత్త టైమింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి.

మారిపోయిన టైమింగ్స్

ఈ రెండు స్టార్ మా సీరియల్స్ టైమింగ్స్ మారిపోయాయి.. కొత్త టెలికాస్ట్ టైమ్ వెల్లడించిన ఛానెల్
ఈ రెండు స్టార్ మా సీరియల్స్ టైమింగ్స్ మారిపోయాయి.. కొత్త టెలికాస్ట్ టైమ్ వెల్లడించిన ఛానెల్

స్టార్ మా తన ఛానెల్లో వచ్చే సీరియల్స్ టైమింగ్స్, ఎపిసోడ్ డ్యూరేషన్ విషయంలో కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పటికే రెండు సీరియల్స్ ను అరగంటకు బదులుగా 45 నిమిషాలకు చేయగా.. ఇప్పుడు చిన్ని, నువ్వు లేక నేను లేను సీరియల్స్ టైమింగ్స్ మార్చేసింది.

సోమవారం (ఫిబ్రవరి 16) చిన్ని సీరియల్ సాయంత్రం 7 గంటలకు బదులుగా సాయంత్రం 6 గంటలకే టెలికాస్ట్ అవుతుంది. ఇక నువ్వు లేక నేను లేను రాత్రి 10 గంటలకు బదులుగా సాయంత్రం 7 గంటలకే వస్తుంది. ఈ రెండు సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమవుతాయి.

ఆ రెండు సీరియల్స్ ఇక 45 నిమిషాలు

ఇక ఇప్పటికే స్టార్ మా ఛానెల్ రెండు టాప్ సీరియల్స్ ఎపిసోడ్ డ్యూరేషన్ పెంచిన విషయం తెలిసిందే. రాత్రి 9 గంటలకు వచ్చే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అరగంటకు బదులుగా 45 నిమిషాలు టెలికాస్ట్ కానుంది. ఇక పొదరిల్లు సీరియల్ 9.45 గంటలకు మొదలై 10.30 గంటల వరకు కొనసాగనుంది. ఈ విషయాన్ని గత వారమే ఆ ఛానెల్ వెల్లడించింది. ఈ రెండు మార్పులు కూడా సోమవారం (ఫిబ్రవరి 16) నుంచే అమల్లోకి వచ్చాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe