Sairaab: బుల్లితెరపైకి కొత్త సీరియల్- ప్రోమోతో మొదలైన వివాదం- 570 కోట్లు రాబట్టిన లవ్ స్టోరీని కాపీ కొట్టారంటూ ఫైర్!
Star Plus Serial Sairaab Promo Controversy: బుల్లితెరపైకి కొత్త సీరియల్ రానుంది. స్టార్ ప్లస్ ఛానల్ తాజాగా సైరాబ్ సీరియల్ ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే, ఆ సీరియల్ గతేడాది బాక్సాఫీస్ వద్ద రూ. 570 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సూపర్ హిట్ లవ్ స్టోరీ మూవీకి కాపీ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.
Star Plus Serial Sairaab Promo Controversy: టెలివిజన్ రంగంలో వినూత్నమైన సీరియల్స్తో దూసుకుపోయే ప్రముఖ వినోద ఛానల్ 'స్టార్ ప్లస్' సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఆ ఛానల్ తాజాగా విడుదల చేసిన ఒక కొత్త సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. గతేడాది బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ఒక లవ్ స్టోరీ మూవీని ఈ సీరియల్ కాపీ కొట్టిందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల ఇంట్రెస్ట్
మన తెలుగులో స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ హిందీ స్టార్ ప్లస్ కథల ఆధారంగా రీమేక్ అవుతుంటాయి. అందుకే అక్కడ ఎలాంటి కొత్త షో వచ్చినా ఆ ప్రభావం ఇక్కడి బుల్లితెరపై కూడా ఉంటుంది. అందుకే వివాదంలో చిక్కుకున్న ఆ కొత్త హిందీ సీరియల్పై తెలుగు బుల్లితెర ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇప్పుడు వివాదంలో నిలిచిన ఆ కొత్త సీరియల్ పేరు 'సైరాబ్' (Sairaab). ఈ సీరియల్ కోసం మేకర్స్ విడుదల చేసిన ఏఐ (AI-generated) ప్రోమో చూసిన వారంతా.. ఇది గతేడాది థియేటర్లలో రికార్డులు సృష్టించిన 'సయ్యారా' (Saiyaara) సినిమాకు కార్బన్ కాపీలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రోమోలో ఏముంది? వివాదం ఏంటి?
స్టార్ ప్లస్ వదిలిన ఆ చిన్న ప్రోమోలో హీరో చేతిలో గిటార్ పట్టుకుని స్టేజ్ మీద రాక్స్టార్లా పర్ఫార్మ్ చేస్తుంటాడు. ప్రేక్షకులు అతని కోసం పెద్దగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో బ్యాక్స్టేజ్లో పసుపు రంగు శారీ కట్టుకున్న హీరోయిన్ అతడిని చూస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది.
హీరో ఆమెను ఆపాలని దూరం నుంచే ప్రయత్నించినా లాభం లేకపోతుంది. ఈ ప్రోమోలో నటీనటుల ముఖాలు స్పష్టంగా చూపించనప్పటికీ, ఆ విజువల్స్ అచ్చంగా 'సయ్యారా' సినిమాను గుర్తుచేస్తున్నాయి.
'సయ్యారా' సినిమాలో హీరో అహాన్ పాండే పోషించిన 'క్రిష్ కపూర్' క్యారెక్టర్ను ఈ ప్రోమోలోని హీరో కాపీ కొట్టినట్లు ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. "ఒరిజినల్ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ను మీరెప్పటికీ రీక్రియేట్ చేయలేరు, ఈ రకమైన కాపీ కొట్టడం మీ అసహనానికి నిదర్శనం" అంటూ ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో నెటిజన్లు కడిగిపారేస్తున్నారు.
లీడ్ రోల్స్ ఎవరు? ఫ్యాన్స్ క్రేజీ గెస్సింగ్స్
మేకర్స్ ఇప్పటివరకు ఈ సీరియల్లో నటించే హీరోహీరోయిన్ల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ ప్రోమో చూసిన బుల్లితెర అభిమానులు మాత్రం తమకు నచ్చిన జోడీలను ఊహించుకుంటున్నారు. గతంలో 'బేపనా' సీరియల్తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హర్షద్ చోప్రా, జెన్నిఫర్ వింగెట్లను ఈ సీరియల్లో జోడీగా పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
మరికొందరేమో ప్రముఖ సంగీత దర్శకుడు అమాల్ మల్లిక్, తాన్యా మిట్టల్ ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ సమయంలో ఏక్తా కపూర్ వీరికి ఒక షో ఆఫర్ చేశారని, ఇటీవల తాన్య తన సరికొత్త టీవీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టినట్లు చెప్పడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది.
బాక్సాఫీస్ను షేక్ చేసిన 'సయ్యారా'
అసలు నెటిజన్లు ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం 'సయ్యారా' సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి, ప్రతిష్టాత్మక యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రం ఒక స్ట్రగ్లింగ్ మ్యూజిషియన్, జర్నలిస్ట్ మధ్య సాగే అందమైన ప్రేమకథ. ఈ సినిమాతోనే అహాన్ పాండే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
అతడితో పాటు అనీత్ పడ్డా కూడా నటనతో మెప్పించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గానూ ఈ చిత్రం ఏకంగా రూ. 570 కోట్ల గ్లోబల్ కలెక్షన్స్తో ఇండస్ట్రీని షేక్ చేసింది. అంతటి క్లాసిక్ లవ్ స్టోరీని ఇలా సీరియల్ రూపంలో కాపీ కొట్టే ప్రయత్నం చేయడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. స్టార్ ప్లస్ కొత్త సీరియల్ వివాదానికి కారణం ఏంటి?
ఛానల్ విడుదల చేసిన 'సైరాబ్' ప్రోమో, గతేడాది విడుదలైన హిట్ సినిమా 'సయ్యారా'లోని విజువల్స్, హీరో రాక్స్టార్ క్యారెక్టరైజేషన్ను పోలి ఉండటమే ఈ వివాదానికి కారణం.
2. 'సయ్యారా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది?
మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన 'సయ్యారా' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 570 కోట్ల భారీ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.
3. 'సైరాబ్' సీరియల్లో నటిస్తున్న హీరో హీరోయిన్లు ఎవరు?
నిర్మాతలు లీడ్ యాక్టర్ల వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే హర్షద్ చోప్రా-జెన్నిఫర్ వింగెట్ లేదా అమాల్ మల్లిక్-తాన్యా మిట్టల్ నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


