ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి ఇంకో ఆరు రోజులే టైమ్ ఉంది. కానీ ఇప్పుడు దేశమంతా రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ ద రివెంజ్' గురించే మాట్లాడుకుంటోంది. గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులన్నీ బద్దలు కొడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. జనాలు ఎగబడి చూస్తుండటంతో థియేటర్ల దగ్గర టికెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. క్రికెట్ లెజెండ్, 1983 వరల్డ్ కప్ విన్నర్ సునీల్ గవాస్కర్కు కూడా ఈ సినిమా టికెట్లు దొరకలేదంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆయన టికెట్ల కోసం సినిమాలో నటించిన ఒక యాక్టర్ను బతిమాలాల్సి వచ్చింది.
టికెట్లు దొరకట్లేదు.. అరేంజ్ చేయండి

ధురంధర్ 2 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో షేర్ చేశాడు. సినిమాలో ఉన్న సస్పెన్స్ను బయటపెట్టొద్దని (స్పాయిలర్స్ ఇవ్వొద్దని) ఫ్యాన్స్ను అడుగుతూనే, గవాస్కర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.
"నిన్న నేను ఇండియా గ్రేట్ స్పోర్ట్స్పర్సన్ సునీల్ గవాస్కర్ ని కలిశాను. అప్పుడు ఆయన నాతో.. రాకేష్ జీ, నాకు సినిమా టికెట్లు దొరకట్లేదు, దయచేసి నాకు ఎలాగైనా అరేంజ్ చేయండి అని అడిగారు. సో ఆయన కోసం టికెట్లు సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను" అని రాకేష్ బేడీ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాలో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్లు నటించారు. ఫస్ట్ పార్ట్ రికార్డును దాటేసి, బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచే దిశగా ఈ సీక్వెల్ దూసుకుపోతోంది. రీసెంట్గా గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ అంతా కలిసి అహ్మదాబాద్లోని ఒక థియేటర్లో ఈ సినిమా చూశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఒక మల్టీప్లెక్స్లో ఈ సినిమా చూస్తూ కనిపించాడు.
గవాస్కర్ విమర్శలు
ఇదిలా ఉంటే రీసెంట్గా గవాస్కర్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు సరిగ్గా లేని ఈ టైమ్లో.. ది హండ్రెడ్ టోర్నీ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కావ్య మారన్కు చెందిన సన్రైజర్స్ లీడ్స్ టీమ్ కొనుగోలు చేయడంపై ఆయన చాలా సీరియస్ అయ్యాడు. గత ఏడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఎవరూ పాక్ ప్లేయర్స్ వెంట పడొద్దని గట్టిగా సూచించాడు.
{{/usCountry}}ఇదిలా ఉంటే రీసెంట్గా గవాస్కర్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు సరిగ్గా లేని ఈ టైమ్లో.. ది హండ్రెడ్ టోర్నీ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కావ్య మారన్కు చెందిన సన్రైజర్స్ లీడ్స్ టీమ్ కొనుగోలు చేయడంపై ఆయన చాలా సీరియస్ అయ్యాడు. గత ఏడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఎవరూ పాక్ ప్లేయర్స్ వెంట పడొద్దని గట్టిగా సూచించాడు.
{{/usCountry}}"2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్లో పాక్ ప్లేయర్స్ను ఇండియన్ ఫ్రాంచైజీలు పూర్తిగా పక్కనపెట్టాయి. మనం పాక్ ప్లేయర్స్కు ఇచ్చే డబ్బులు, వాళ్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్తాయి. ఆ డబ్బుతో వాళ్లు ఆయుధాలు కొని మన సైనికులపై, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఈ విషయం అర్థమయ్యాక ఇండియన్ కంపెనీలు వాళ్లను తీసుకోవడం మానేశాయి. కచ్చితంగా టీమ్ ఓనర్ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఆ ప్లేయర్ను కొనకుండా ఆపాల్సింది. వేరే ఏ దేశం ఆడని ఫార్మాట్లో ఒక టోర్నీ గెలవడం, మన భారతీయుల ప్రాణాల కంటే ఎక్కువా?" అని మిడ్ డే పత్రికలో రాసిన తన కాలమ్లో గవాస్కర్ సూటిగా ప్రశ్నించాడు.