Dhurandhar 2 Tickets: నాకు ధురంధర్ 2 టికెట్లు దొరకడం లేదు.. కాస్త ఇప్పించండి: నటుడిని కోరిన లెజెండరీ క్రికెటర్ గవాస్కర్

Actor Rakesh Bedi revealed that even the great Sunil Gavaskar is not able to get tickets for ‘Dhurandhar: The Revenge’. 

Published on: Mar 23, 2026, 18:30:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి ఇంకో ఆరు రోజులే టైమ్ ఉంది. కానీ ఇప్పుడు దేశమంతా రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ ద రివెంజ్' గురించే మాట్లాడుకుంటోంది. గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులన్నీ బద్దలు కొడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. జనాలు ఎగబడి చూస్తుండటంతో థియేటర్ల దగ్గర టికెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. క్రికెట్ లెజెండ్, 1983 వరల్డ్ కప్ విన్నర్ సునీల్ గవాస్కర్‌కు కూడా ఈ సినిమా టికెట్లు దొరకలేదంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆయన టికెట్ల కోసం సినిమాలో నటించిన ఒక యాక్టర్‌ను బతిమాలాల్సి వచ్చింది.

Dhurandhar 2 Tickets: నాకు ధురంధర్ 2 టికెట్లు దొరకడం లేదు.. కాస్త ఇప్పించండి: నటుడిని కోరిన లెజెండరీ క్రికెటర్ గవాస్కర్ (AFP/Ranveer Singh Instagram)
Dhurandhar 2 Tickets: నాకు ధురంధర్ 2 టికెట్లు దొరకడం లేదు.. కాస్త ఇప్పించండి: నటుడిని కోరిన లెజెండరీ క్రికెటర్ గవాస్కర్ (AFP/Ranveer Singh Instagram)

టికెట్లు దొరకట్లేదు.. అరేంజ్ చేయండి

ధురంధర్ 2 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశాడు. సినిమాలో ఉన్న సస్పెన్స్‌ను బయటపెట్టొద్దని (స్పాయిలర్స్ ఇవ్వొద్దని) ఫ్యాన్స్‌ను అడుగుతూనే, గవాస్కర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

"నిన్న నేను ఇండియా గ్రేట్ స్పోర్ట్స్‌పర్సన్ సునీల్ గవాస్కర్ ని కలిశాను. అప్పుడు ఆయన నాతో.. రాకేష్ జీ, నాకు సినిమా టికెట్లు దొరకట్లేదు, దయచేసి నాకు ఎలాగైనా అరేంజ్ చేయండి అని అడిగారు. సో ఆయన కోసం టికెట్లు సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను" అని రాకేష్ బేడీ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్లు నటించారు. ఫస్ట్ పార్ట్ రికార్డును దాటేసి, బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచే దిశగా ఈ సీక్వెల్ దూసుకుపోతోంది. రీసెంట్‌గా గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ అంతా కలిసి అహ్మదాబాద్‌లోని ఒక థియేటర్‌లో ఈ సినిమా చూశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఒక మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా చూస్తూ కనిపించాడు.

గవాస్కర్ విమర్శలు

ఇదిలా ఉంటే రీసెంట్‌గా గవాస్కర్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు సరిగ్గా లేని ఈ టైమ్‌లో.. ది హండ్రెడ్ టోర్నీ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ టీమ్ కొనుగోలు చేయడంపై ఆయన చాలా సీరియస్ అయ్యాడు. గత ఏడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఎవరూ పాక్ ప్లేయర్స్ వెంట పడొద్దని గట్టిగా సూచించాడు.

"2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్‌లో పాక్ ప్లేయర్స్‌ను ఇండియన్ ఫ్రాంచైజీలు పూర్తిగా పక్కనపెట్టాయి. మనం పాక్ ప్లేయర్స్‌కు ఇచ్చే డబ్బులు, వాళ్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్తాయి. ఆ డబ్బుతో వాళ్లు ఆయుధాలు కొని మన సైనికులపై, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఈ విషయం అర్థమయ్యాక ఇండియన్ కంపెనీలు వాళ్లను తీసుకోవడం మానేశాయి. కచ్చితంగా టీమ్ ఓనర్ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఆ ప్లేయర్‌ను కొనకుండా ఆపాల్సింది. వేరే ఏ దేశం ఆడని ఫార్మాట్‌లో ఒక టోర్నీ గెలవడం, మన భారతీయుల ప్రాణాల కంటే ఎక్కువా?" అని మిడ్ డే పత్రికలో రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ సూటిగా ప్రశ్నించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More