Karuppu OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన సూర్య రూ. 300 కోట్ల బ్లాక్‌బస్టర్ కరుప్పు.. 28 రోజులకే స్ట్రీమింగ్.. కారణం ఇదే!

Karuppu OTT: బాక్సాఫీస్ ను షేక్ చేసిన సూర్య లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘కరుప్పు’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో వీరభద్రుడుగా రిలీజైన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో బాగానే ఆడుతున్నా.. 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం వెనుక రీజన్ ఇక్కడ చూసేయండి.

Jun 12, 2026, 05:55:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karuppu OTT: కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష కాంబినేషన్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన ఫాంటసీ కోర్టురూమ్ డ్రామా ‘కరుప్పు’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) పేరుతో రిలీజైన ఈ మూవీ ఇవాళ (జూన్ 12) డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది.

ఓటీటీలోకి వచ్చేసిన కరుప్పు (x/Suriya_offl)
ఓటీటీలోకి వచ్చేసిన కరుప్పు (x/Suriya_offl)

కరుప్పు ఓటీటీ

కొంతకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో సూర్యకు బ్లాక్ బస్టర్ అందించిన మూవీ ‘కరుప్పు’. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడీ సూపర్ హిట్ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది.

బ్లాక్ బస్టర్

థియేటర్లలో రూ. 304 కోట్లు కొల్లగొట్టి, ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న కరుప్పు సినిమాను కేవలం 4 వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చారు. దీని వెనుక ఉన్న అసలు ట్రేడ్ సీక్రెట్, ఇండస్ట్రీ ఇన్‌సైడ్ అనాలసిస్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

బాక్సాఫీస్ షేక్ చేసిన కరుప్పు

మే 15న థియేటర్లలో విడుదలైన కరుప్పు చిత్రం బాక్సాఫీస్ వద్ద సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్‌గా నిలిచింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఆర్థిక వివాదాల వల్ల మొదటి రోజు థియేట్రికల్ రన్ ఆలస్యమైనప్పటికీ, కేవలం పాజిటివ్ టాక్‌తోనే ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అయితే, థియేట్రికల్ విండో రూల్స్ బ్రేక్ చేస్తూ జూన్ 12 నుంచే ఈ సినిమాను ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తుండటం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఎందుకు?

సాధారణంగా రూ. 300 కోట్లు వసూలు చేసిన పెద్ద సినిమాలకు కనీసం 6 నుంచి 8 వారాల థియేట్రికల్ విండో ఉంటుంది. కానీ 'వీరభద్రుడు' విషయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఒక భారీ మాస్టర్ ప్లాన్ వేసింది.

ప్రస్తుతం ఇండియన్ ఓటీటీ మార్కెట్‌లో డిజిటల్ రైట్స్ అగ్రిమెంట్లు ఎర్లీ స్ట్రీమింగ్ క్లాజ్‌తో ముడిపడి ఉంటున్నాయి. సినిమా విడుదలకు ముందే ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. బాక్సాఫీస్ వద్ద బజ్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఓటీటీలోకి తెస్తే, డిజిటల్ వ్యూయర్‌షిప్ రికార్డు స్థాయిలో వస్తుందని ప్రైమ్ భావించింది.

ఈ కారణం కూడా

మరో ప్రధాన కారణం ఈ సినిమా క్రేజీ కంటెంట్. ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ కేవలం ఒక రొటీన్ కోర్టురూమ్ డ్రామా కాదు. న్యాయ వ్యవస్థలోని లోపాలను వాడుకునే అవినీతి లాయర్ బేబీ కన్నన్ (ఆర్జే బాలాజీ) వర్సెస్ మానవ రూపంలో భూమికి వచ్చిన గ్రామ దేవత 'కరుప్పుసామి' (సూర్య) మధ్య సాగే పొలిటికల్ అండ్ డివైన్ మైండ్ గేమ్.

పురాణ గాథలను ఆధునిక లీగల్ సిస్టమ్‌తో మిక్స్ చేసిన విధానం మల్టీప్లెక్స్, ఓటీటీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ 'బింజ్-వాచ్' కంటెంట్. సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఈ వీకెండ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

People Also Ask: తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

వీరభద్రుడు మూవీ హిట్టా ఫ్లాపా?

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘ఇండస్ట్రీ హిట్’ స్టేటస్ అందుకుంది. సూర్య కెరీర్‌లో మొదటిసారి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.

వీరభద్రుడు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

సూర్య, త్రిష నటించిన 'వీరభద్రుడు' (కరుప్పు ఒరిజినల్ వెర్షన్) చిత్రం జూన్ 12, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

కరుప్పు మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా?

అవును. ఇది ఎలాంటి అశ్లీలత లేని క్లీన్ ఫాంటసీ కోర్టురూమ్ డ్రామా. గ్రామ దేవత నేపథ్యం, సామాజిక అంశాలు ఉండటం వల్ల పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా హ్యాపీగా చూడవచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More