...
...
Next Story

OTT Trending: ఫ్యామిలీకి వీకెండ్ పర్ఫెక్ట్ వాచ్‌.. ఓటీటీని షేక్ చేస్తున్న లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. ఓ లుక్కేయండి

OTT Trending: తెలుగు ఓటీటీ ఆడియన్స్ కు అదిరే న్యూస్. రీసెంట్ గా థియేటర్లలో అదరగొట్టిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. ఇండియా వైడ్ గా నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. మరి ఈ వీకెండ్ లో ఫ్యామిలీకి పర్ఫెక్ట్ వాచ్ గా మారిన ఈ మూవీ ఏంటో ఓ లుక్కేయండి.

Published on: Sep 12, 2026, 14:31:04 IST
Advertisement

OTT Trending: సూర్య హీరోగా తెరకెక్కిన క్లాస్ అండ్ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' డిజిటల్ స్పేస్‌లో అద్భుతమైన ఆరంభాన్ని దక్కించుకుంది. ఓటీటీని షేక్ చేస్తోంది. థియేటర్లలో రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ అదరగొట్టింది. ఫ్యామిలీస్ కు పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ గా మారింది.

విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రెండింగ్

ఫ్యామిలీకి వీకెండ్ పర్ఫెక్ట్ వాచ్‌.. ఓటీటీని షేక్ చేస్తున్న లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. ఓ లుక్కేయండి
ఫ్యామిలీకి వీకెండ్ పర్ఫెక్ట్ వాచ్‌.. ఓటీటీని షేక్ చేస్తున్న లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. ఓ లుక్కేయండి

నెట్‌ఫ్లిక్స్ లో గ్రాండ్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు జనాల నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన 24 గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 మూవీస్ చార్ట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది ఈ మూవీ. ఇప్పుడు ఇండియా వైడ్ గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నంబర్ వన్ గా కొనసాగుతోంది విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా.

సూర్య, మమితా జోడీ

'కరుప్పు' వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత సూర్య నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీ సబ్జెక్ట్‌కు డిజిటల్ వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఓటీటీలో ట్రెండింగ్ ఎందుకు?

తమిళ థియేట్రికల్ మార్కెట్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఓటీటీ వేదికపై మాత్రం వ్యూయర్ షిప్ సునామీ కనిపిస్తోంది. తమిళనాడు థియేటర్లలో మాస్. యాక్షన్ సినిమాలకు లభించే ఆదరణతో పోలిస్తే.. వెంకీ అట్లూరి మార్క్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్లకు తెలుగు, హిందీ డిజిటల్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు.

ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య చూపించిన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, మమితా బైజు చలాకీతనం కథను ముందుకు నడిపించాయి. వీరికి తోడుగా సీనియర్ నటీనటులు రాధికా శరత్‌కుమార్, నాజర్, రవీనా టాండన్, సునీల్ రెడ్డి, భవానీ శ్రీ వంటి ప్రముఖులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం కథలోని ఎమోషనల్ సీన్లను మరింతగా పండించింది. విభిన్న భాషల ప్రేక్షకులు ఈ సినిమాను రీజనల్ లాంగ్వేజెస్ డబ్బింగ్‌లో చూస్తుండటంతో రాబోయే వారాల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ నేషనల్ అండ్ గ్లోబల్ చార్ట్స్‌లో ఈ సినిమా తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks