Taapsee Pannu: ఇటీవల భారీ బడ్జెట్తో తెరకెక్కిన రామ్ చరణ్ 'పెద్ది', కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' చిత్రాల్లో హీరోయిన్లను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. సినిమాల్లో స్త్రీలను కేవలం గ్లామర్ బొమ్మలుగా, ఆబ్జెక్టిఫై చేస్తూ చూపించడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై తాప్సీ పన్ను రియాక్టయింది.
తాప్సీ కామెంట్లు

తాప్సీ లీడ్ రోల్ ప్లే చేసిన గాంధారి మూవీ డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ సంచలన కామెంట్లు చేసింది. సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానంపై అడిగిన ప్రశ్నకు తాప్సీ స్పందిస్తూ.. "సోషల్ మీడియాలో కనిపించే డిజిటల్ ప్రపంచం వేరు, గ్రౌండ్ లెవల్ లో ఉండే నిజ ప్రపంచం వేరు. ముఖ్యంగా మాస్ సినిమాలపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది’’ అని తాప్సీ చెప్పింది.
అవే ఫొటోలను
‘‘మీరు నెట్లో ఎంత రచ్చ చేసినా కూడా.. అదే ఫొటోలను జూమ్ చేస్తూ, విచిత్రమైన యాంగిల్స్తో వీడియోలు చేసి వైరల్ చేసే వర్గం కూడా సోషల్ మీడియాలోనే ఉంది. అంటే అలాంటి కంటెంట్కు కూడా అక్కడ ఆదరణ ఉందనేది కొట్టిపారేయలేం" అని తాప్సీ పేర్కొంది.
డిమాండ్ ఉందని
సినీ పరిశ్రమ నడిచే తీరును వివరిస్తూ తాప్సీ మరింత కీలక వ్యాఖ్యలు చేసింది. "అంతా డిమాండ్, సరఫరా సూత్రంపైనే నడుస్తోంది. జనాలు ఇదే కోరుకుంటున్నారని, ఇలా చేస్తేనే డబ్బులు వస్తాయని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. దాంతో కళ, నటన పక్కకు వెళ్లిపోతున్నాయి. కోవిడ్ మహమ్మారి కంటే ముందు మన ఇండస్ట్రీ మంచి ప్రగతి సాధించింది.
కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతుల్లోకే జారిపోతున్నాం. సినిమా సరిగ్గా లేకపోతే దానికి ప్రేక్షకులపై నింద వేసి మేకర్స్ తప్పించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నటీనటులుగా మేం ఎంత పోరాడినా గెలవలేం. ప్రేక్షకులు మారితేనే, వారు మాకు మద్దతు ఇస్తేనే ఈ పోరాటంలో మేం గెలవగలుగుతాం" అని తాప్సీ చెప్పింది.
'పెద్ది', 'టాక్సిక్' వివాదం
{{/usCountry}}కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతుల్లోకే జారిపోతున్నాం. సినిమా సరిగ్గా లేకపోతే దానికి ప్రేక్షకులపై నింద వేసి మేకర్స్ తప్పించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నటీనటులుగా మేం ఎంత పోరాడినా గెలవలేం. ప్రేక్షకులు మారితేనే, వారు మాకు మద్దతు ఇస్తేనే ఈ పోరాటంలో మేం గెలవగలుగుతాం" అని తాప్సీ చెప్పింది.
'పెద్ది', 'టాక్సిక్' వివాదం
{{/usCountry}}దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'పెద్ది' చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర) రూపాన్ని, దుస్తులను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పాత్రలోని ఎమోషన్స్ కంటే కూడా ఆమె శారీరక సౌందర్యానికి, కెమెరా యాంగిల్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని నెటిజన్లు మండిపడ్డారు.
ఈ వివాదం తీవ్రతను గ్రహించిన దర్శకుడు ఆ సీన్లను సినిమా నుంచి తొలగించడమే కాకుండా, బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు.
మరోవైపు యష్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' విషయంలోనూ ఇదే వివాదం చెలరేగింది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్లను కేవలం గ్లామర్, శృంగారం, హీరో చుట్టూ తిరిగే పాత్రలుగానే చూపించారని ప్రేక్షకులు విమర్శించారు.