...
...
Next Story

బ‌య‌టి నుంచి వచ్చా-ఒక‌రికి క్లోన్‌లా, ఫ‌స్ట్ కాపీలా ఉండాల‌నుకోను-సినిమాలు బ్యాంక్ బ్యాలెన్స్ కోసం కాదు: తాప్సీ కామెంట్లు

సినీ పరిశ్రమలో బయటి నుంచి వచ్చి, సొంతంగా గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లపై 'హిందుస్థాన్ టైమ్స్' తో ఆమె మాట్లాడింది. తాను ఒకరికి క్లోన్ లా, ఫస్ట్ కాపీలా ఉండాలనుకోనని, సినిమాలు బ్యాంక్ బ్యాలెన్స్ కోసం కాదంటూ తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

Published on: Jan 7, 2026, 10:26:37 IST
Advertisement

తాప్సీ పన్ను సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు దాటింది. సినీ కుటుంబ నేపథ్యం లేకుండా, బయటి వ్యక్తిగా అడుగుపెట్టిన తాప్సీ పన్ను తనకు ఎప్పుడూ సులభమైన దారి ఉండదని అంగీకరిస్తుంది. తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది. ఒకరికి క్లోన్ లా, ఫస్ట్ కాపీలా ఉండనని చెప్తోంది తాప్సీ. బ్యాంక్ బ్యాలెన్స్ కోసం సినిమాలు చేయడం లేదని తెలిపింది.

తాప్సీ కామెంట్లు

తాప్సీ పన్ను (Instagram)
తాప్సీ పన్ను (Instagram)

ఇండస్ట్రీలోకి బయటి నుంచి వచ్చిన వ్యక్తిగా పరిశ్రమలో తన ప్రయాణంలో నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటని అడిగినప్పుడు, తాప్సీ నవ్వుతూ 'అది ఎప్పుడూ సులభం కాదు' అని బదులిచ్చింది. 'మీరు ఎప్పుడూ పొందలేనిది ఏదైనా కోరుకుంటే, మీరు ఎవరూ చేయనిది ఏదైనా చేయాలి. నా పని భావి తరాల కోసం అని నేను గుర్తుంచుకోవాలి, కాబట్టి నేను ఏది చేసినా, నా జీవితంలోని ప్రతి దశలోనూ దాన్ని సొంతం చేసుకోగలగాలి’’ అని తాప్సీ చెప్పింది.

క్లోన్ లా కాదు

‘‘నేను ఎవరికైనా క్లోన్ లా ఉండటానికి ఇక్కడ లేను, ఎందుకంటే అప్పుడు నా జీవితమంతా ఫస్ట్ కాపీలా ఉండటానికే సరిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన గొంతుతో, రూపుతో ఉన్నారు. కాబట్టి నేను నాదాన్ని కనుగొనాలి, ఎందుకంటే అది శాశ్వతమైన ప్రభావాన్ని చూపడానికి ఉత్తమ మార్గం' అని తాప్సీ చెప్పింది. ఇటీవల ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో కనిపించింది తాప్సీ.

సౌత్ సినిమాలు

ఝుమ్మంది నాదం సినిమాతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది తాప్సీ పన్ను. ఆ తర్వాత చాలా కాలం పాటు తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు చేసింది. 2022 నుంచి వరుసగా హిందీ మూవీస్ చేస్తోంది. సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ ప్రారంభంలో సౌత్ లో సంప్రదాయ, స్పష్టమైన ప్రాజెక్టులను ఎంచుకున్నా. కానీ అది తన కోసం ఉద్దేశించిన మార్గం కాదని తర్వాత గ్రహించా’’ అని ఆమె చెప్పింది.

బ్యాంక్ బ్యాలెన్స్ కోసం కాదు

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe