Tammareddy: టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గురించి తెలియని వాళ్లుండరు. ఎలాంటి సందేహం లేకుండా అనుకున్నది అనుకున్నట్లు ఆయన మాట్లాడతారు. తాజాగా దిగ్గజ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ను ఉద్దేశించి తమ్మారెడ్డి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
శ్రీనివాస మంగాపురం ఈవెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా లాంఛ్ అవుతున్నాడు. అతని డెబ్యూ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రానికి అజయ్ భూపతి డైరెక్టర్. ఇందులో రషా తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ స్టార్స్ ను పరిచయం చేసేందుకు ‘శ్రీను అండ్ మంగ ఇంట్రడక్షన్ ఈవెంట్’ ను శనివారం (మే 30) నిర్వహించారు. ఈ మూవీని అశ్వినీ దత్ ప్రజెంట్ చేస్తున్నారు.
తమ్మారెడ్డి కామెంట్లు
శ్రీనివాస మంగాపురం ఈవెంట్ కు రాఘవేంద్ర రావు, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ అశ్వినీ దత్ గురించి సంచలన కామెంట్లు చేశారు.
‘‘తెలుగు సినిమాకు అందం, ఒక వన్నె తెచ్చింది దత్ (అశ్వినీ దత్). సినిమాకు గ్లామర్ తెచ్చాడు. ఎన్టీ రామారావుతో పాటలు పాడించి ఆ రోజుల్లోనే విచిత్రం చేశాడు. ఎవరు ఈ పిచ్చోడు అనుకున్నాం. సినిమా రిలీజ్ అయ్యాక మమ్మల్ని పిచ్చోళ్లను చేశాడు’’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
రాఘవేంద్ర రావు గురించి
‘‘రాఘవేంద్ర రావు మాస్టర్ క్రాఫ్ట్ మాన్. తెలుగు సినిమాకే కాదు భారత సినిమాకే ఒక రకమైన కొత్త ఒరవడి సృష్టించాడు. వీళ్లిద్దరు (అశ్వినీ దత్, రాఘవేంద్ర రావు) కలిసి ఎన్ని సినిమాలు చేశారో దిక్కు మొక్కు లేదు. ఇద్దరు కలిసి అద్భుతాలు చేశారు’’ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
ఘట్టమనేని వారసుడు
{{/usCountry}}‘‘రాఘవేంద్ర రావు మాస్టర్ క్రాఫ్ట్ మాన్. తెలుగు సినిమాకే కాదు భారత సినిమాకే ఒక రకమైన కొత్త ఒరవడి సృష్టించాడు. వీళ్లిద్దరు (అశ్వినీ దత్, రాఘవేంద్ర రావు) కలిసి ఎన్ని సినిమాలు చేశారో దిక్కు మొక్కు లేదు. ఇద్దరు కలిసి అద్భుతాలు చేశారు’’ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
ఘట్టమనేని వారసుడు
{{/usCountry}}ఘట్టమనేని వంశం నుంచి మూడో తరం సినిమాల్లోకి వస్తోంది. సూపర్ స్టార్, దివంగత కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీనివాస మంగాపురం మూవీతో అడుగుపెడుతున్నాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
శ్రీనివాస మంగాపురం నుంచి ఇప్పటికే టీజర్ రిలీజైంది. ఘట్టమనేని జయకృష్ణ ఇప్పటికే తన లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మిస్తున్నాడు. దీనికి జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో జయకృష్ణ, రషా తడానీ, మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు నటిస్తున్నారు.