మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి బ్లాక్బస్టర్ తెలుగు రొమాంటిక్ డ్రామా.. బాక్సాఫీస్ దగ్గర 600 శాతం వసూళ్లు
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోనే బ్లాక్బస్టర్ తెలుగు రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కు రాబోతోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే రానుండటం విశేషం. బడ్జెట్ కంటే ఏకంగా 600 శాతం ఎక్కువ వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము రేపింది.
ఈ ఏడాది రిలీజైన తెలుగు సినిమాల్లో అతి పెద్ద హిట్ సాధించిన చిన్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ 623 శాతం లాభాలతో దుమ్ము రేపింది. విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ రిలీజ్ డేట్
రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈటీవీ విన్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. గురువారమే (డిసెంబర్ 18) మూవీ ప్రీమియర్ ఉంటుందని ఆ ఓటీటీ వెల్లడించింది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ చిన్న సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ థియేటర్ల కంటే ఎక్కువ రన్టైమ్ తో రానుండటం కూడా మరో విశేషం. బిగ్గెస్ట్ లవ్ స్టోరీ మీ ఇళ్లకు వస్తోందనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఈ మూవీ కౌంట్డౌన్ మొదలుపెట్టింది.
రాజు వెడ్స్ రాంబాయి మూవీ గురించి..
రాజు వెడ్స్ రాంబాయి సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. క్రమంగా కలెక్షన్లు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే’ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఈ సాంగ్ తో సినిమాపై ఇంట్రెస్ట్ మరింత ఎక్కువైంది.
రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు సాయిలు కంభంపాటి డైరెక్టర్. ఇందులో అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు నటించారు.
రాజు వెడ్స్ రాంబాయి స్టోరీ
ఖమ్మం, వరంగల్ సరిహద్దులో ఉన్న ఓ గ్రామంలో ప్రేమను గెలిపించుకోవడానికి లవర్స్ ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా మూవీ తీయడం విశేషం. రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొడుతుంటాడు. గ్రామంలో పెళ్లయినా, చావైనా రాజ్ బ్యాండ్ మోగాల్సిందే. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్విని రావ్)ని రాజు ప్రేమిస్తాడు.
రాంబాయి కూడా రాజును ఇష్టపడుతుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) మాత్రం తన కూతురి పెళ్లి గవర్నమెంట్ జాబ్ ఉన్నోడితోనే చేయించాలనుకుంటాడు. దీంతో రాంబాయిని పెళ్లి చేసుకోవాలనే రాజు.. ముందే ప్రెగ్నెంట్ చేస్తే చచ్చినట్లు పెళ్లి చేస్తారనుకుంటాడు. రాంబాయి ప్రెగ్నెంట్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వెంకన్న ఏం చేశాడు? రాజు, రాంబాయిల పెళ్లి జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


