...
...
Next Story

మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ మూవీ.. తండ్రిలా లవ్ మ్యారేజీ చేసుకోవాలనుకునే కొడుకు

తెలుగు రొమాంటిక్ మూవీ శశివదనే మరో ఓటీటీలోకి వచ్చేసింది. తండ్రిలా లవ్ మ్యారేజీ చేసుకోవాలనుకునే కొడుకు కథతో వచ్చిన మూవీ ఇది. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: Dec 13, 2025, 21:10:24 IST
Advertisement

తెలుగు రొమాంటిక్ మూవీ ‘శశివదనే’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతున్న ఈ సినిమా ఇంకో ప్లాట్ ఫామ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ రొమాంటిక్ మూవీ థియేటర్లలో యూత్ ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోనూ సత్తాచాటుతోంది.

మరో ఓటీటీలోకి శశివదనే

మరో ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ (x)
మరో ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ (x)

రూరల్ లవ్ స్టోరీ శశివదనే మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 28న సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోనూ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ మూవీ శశివదనేలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించారు.

శశివదనే స్టోరీ

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ శశివదనే. గోదావరి లంక గ్రామంలో ఉండే ఓ సాధారణ యువకుడు రాఘవ (రక్షిత్). తల్లి చనిపోవడంతో తండ్రి (శ్రీమాన్) అన్నీ తానై సాయిని పెంచుతాడు. డిగ్రీ కంప్లీట్ చేసిన రాఘవ ఎమ్మెస్సీ చేయాలనుకుంటాడు. అదే సమయంలో తండ్రి లాగే ప్రేమ వివాహం చేసుకోవాలనే కలతో ఉంటాడు. అప్పుడే ఒక రోజు రోడ్డు మీద శశి (కోమలి)ని చూసి ప్రేమలో పడతాడు.

తండ్రి కాదనడంతో

శశి కూడా రాఘవను ప్రేమిస్తుంది. కానీ శశి తండ్రికి ఈ ప్రేమంటే ఇష్టముండదు. తన కూతురు ఒక సాధారణ యువకుడిని ప్రేమించడాన్ని అస్సలు ఒప్పుకోడు. కానీ శశి, రాఘవ రహస్యంగా కలుస్తూనే ఉంటారు. మరి చివరకు ఏమైంది? శశి, రాఘవ పెళ్లి చేసుకున్నారా? అందుకు శశి తండ్రి ఒప్పుకున్నాడా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

అంతంతమాత్రమే

అయితే థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన శశివదనే సినిమా ఓటీటీలో మాత్రం సత్తాచాటుతోంది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీలను ఇష్టపడే ఆడియన్స్ శశివదనే మూవీని చూసేయండి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe