Jana Nayakudu: కోలీవుడ్ సూపర్స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' రిలీజ్ డేట్ అఫీషియల్గా వచ్చేసింది. జులై 23, 2026న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ పవర్ఫుల్ పోలీస్ అవతారంలో కనిపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు.
అగ్నిపరీక్షకు నిలిచిందంటూ..

జన నాయగన్ మూవీ మేకర్స్ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.. ఈ సినిమా గురించి చెబుతూ.. “అగ్ని పరీక్షకు నిలిచింది.. కాలంతోపాటు బలపడింది.. చరిత్ర సృష్టించిడానికి నిర్మించబడింది.. పోరాటం ఎంత కఠినమైతే.. విజయం సౌండ్ అంత గట్టిగా ఉంటుంది” అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీనికి ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా జత చేశారు.
హెచ్ వినోద్ ఇంటెన్స్ మార్క్.. పాలిటిక్స్ బ్యాక్డ్రాప్
ఈ జన నాయగన్ సినిమాను తెలుగులో 'జన నాయకుడు', హిందీలో 'జన్ నేత' పేరుతో ఒరిజినల్ తమిళ వెర్షన్ తో పాటు ఒకేసారి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్ కు అసలైన సర్ప్రైజ్ విజయ్ టైటిల్ కార్డ్ చేంజ్ కావడం. ఇప్పటివరకు 'దళపతి'గా స్క్రీన్ పై కనిపించిన ఆయన.. ఇప్పుడు "గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్" పేరుతో రీ-ఇంట్రడ్యూస్ కాబోతున్నారు.
ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను ఇంటెన్స్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో 'థీరన్ అధికారం ఒండ్రు', 'తునివు', 'వలిమై' లాంటి మైండ్ బ్లోయింగ్ సినిమాలతో తన మార్క్ చూపించిన వినోద్.. ఈసారి విజయ్ రియల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే స్క్రిప్ట్ రెడీ చేశారు. సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ హై లెవెల్ లో ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్.
పూజా హెగ్డే కంబ్యాక్.. సాలిడ్ కాస్టింగ్
సినిమాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ గా నటించింది. 'బీస్ట్' సినిమా సక్సెస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ కావడంతో స్క్రీన్ కెమిస్ట్రీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
{{/usCountry}}సినిమాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ గా నటించింది. 'బీస్ట్' సినిమా సక్సెస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ కావడంతో స్క్రీన్ కెమిస్ట్రీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
{{/usCountry}}'యానిమల్', 'కంగువ' సినిమాలతో విలనిజంలో కొత్త బెంచ్మార్క్ సెట్ చేసిన బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. మాలీవుడ్ సెన్సేషన్ 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు ఒక కీ రోల్ లో కనిపించబోతోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ప్లాన్.. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటంతో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
విజయ్ కెరీర్ లో ఇదే లాస్ట్ సినిమా కావడంతో రాబోయే రోజుల్లో ప్రమోషనల్ క్యాంపెయిన్ మరింత అగ్రెసివ్ గా ప్లాన్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్టైమ్ రికార్డులు క్రియేట్ అవ్వడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.