ఈ వారం ఓటీటీలోకి రెండు క్రేజీ మలయాళం సినిమాలు-సైకో కిల్లర్ గా మమ్ముట్టి- మోహన్లాల్ యాక్షన్ మూవీ-ఓ లుక్కేయండి
సంక్రాంతి సందడిని మరింత పెంచేందుకు ఈ వారం ఓటీటీలోకి రెండు క్రేజీ మలయాళం సినిమాలు రాబోతున్నాయి. స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ చిత్రాలేంటో ఓ లుక్కేయండి.
సంక్రాంతి సందర్బంగా థియేటర్లో సినిమాల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ సినిమాలతో థియేటర్లు నిండిపోతున్నాయి. ఇక ఓటీటీలోని పండగ జోష్ ను మరింత పెంచేందుకు చిత్రాలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు క్రేజీ మలయాళం సినిమాలు ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ ను మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చనున్నాయి. అవే కాలమ్ కావల్, భా భా బా. ఈ రెండు ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్నాయ

కాలమ్ కావల్ ఓటీటీ
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ కాలమ్ కావల్. ఇందులో మమ్ముట్టితో పాటు వినాయనక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మలయాళ థ్రిల్లర్ జనవరి 16న ఓటీటీలోకి వస్తుంది. సోనీ లివ్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కాలమ్ కావల్ స్ట్రీమింగ్ కానుంది.
కాలమ్ కావల్ స్టోరీ
కాలమ్ కావల్ మూవీ కైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీనికి జితిన్ కే జోస్ డైరెక్టర్. ఇందులో మమ్ముట్టి సైకో కిల్లర్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు. సైనేడ్ మోహన్ అనే సీరియల్ కిల్లర్ జీవిక కథ ఆధారంగా ఈ మూవీ రూపొందించినట్లు తెలిసింది. కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని గ్రామాల్లో మహిళలు వరుసగా హత్యలకు గురవుతారు. ఈ హత్యలు చేసే సీరియల్ కిిల్లర్ ఎవరు? అనేది ఉత్కంఠ పంచుతుంది.
భా భా బా ఓటీటీ
మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో కనిపించిన మరో మలయాళం సినిమా భా భా బా. ఇందులో దిలీప్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా జనవరి 16న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇదో మలయాళం యాక్షన్ కామెడీ మూవీ. దీనికి ధనంజయ్ శంకర్ డైెరెక్టర్.
భా భా బా స్టోరీ
వెరైటీ టైటిల్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది భా భా బా మూవీ. కానీ థియేటర్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. కేరళ సీఎం సీకే జోసఫ్ ను కామనర్ అనే ఓ రౌడీ కిడ్నాప్ చేస్తాడు.
ఈ కిడ్నాప్ తో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారుతుంది. ఆ కామనర్ ను పట్టుకునేందుకు నోబుల్ అనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. మరి సీఎంను కిడ్నాప్ చేసింది ఎవరు? దీనికి కారణం ఏంటీ? అన్నది భా భా బా మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


