టాక్సిక్ మూవీని వివాదాలు వీడటం లేదు. యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మరోసారి కాంట్రవర్సీలో చిక్కుకుంది. టాక్సిక్ హీరోయిన్ కియారా అద్వాణి ఫొటోను ఏఐతో క్రియేట్ చేశారనే ట్రోల్స్ వస్తున్నాయి. అసలేమైందో ఇక్కడ తెలుసుకోండి.
టాక్సిక్ సాంగ్

టాక్సిక్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ‘తబాహీ’ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఫస్ట్ ఓ పోస్టర్ పంచుకున్నారు. ఇందులో హీరోయిన్ కియారా ముఖం కనిపించలేదు. కేవలం యశ్ ను మాత్రమే హైలైట్ చేశారు. దీంతో పురష అహంకారం అంటూ విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ కియారా అద్వాణి, యశ్ రొమాంటిక్ గా ఉన్న మరో పోస్టర్ ను శనివారం (ఫిబ్రవరి 28) రాత్రి రిలీజ్ చేశారు.
రొమాంటిక్ గా
లేెటెస్ట్ పోస్టర్ లో కియారా అద్వాణి, యశ్ రొమాంటిక్ గా ఉన్నారు. బీచ్ లో కియారా కూర్చుని ఉండగా, షర్ట్ లేకుండా ఉన్న యశ్ ఆమె ఒడిలో పడుకున్నాడు. యష్ కేవలం గ్రే ప్యాంట్ మాత్రమే ధరించాడు. కియారా వైట్ షర్ట్ వేసుకుంది. ఈ పోస్ట్ను టాక్సిక్ సినిమా అధికారిక పేజీ షేర్ చేసింది. క్యాప్షన్లో "12:59 PM, మార్చి 2nd" అని సాంగ్ రిలీజ్ టైమ్ ఉంది.
ఏఐతో కియారా
కియారా అద్వాణి, యశ్ రొమాంటిక్ ఫొటోపై ట్రోల్స్ వస్తున్నాయి. ‘‘ఫైనల్ గా కియారా ముఖాన్ని చూపించారు’’, ‘‘చాలా కాలం తర్వాత కియారాను చూస్తున్నా’’, ‘‘కియారా ముఖాన్ని ముందు ఎందుకు దాచిపెట్టారు’’ అనే కామెంట్లు వస్తున్నాయి. అయితే అన్నింటికంటే కూడా కియారా చేయి ఎందుకు పొడవుగా ఉందనే కామెంట్లు వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో చూస్తే కియారా చేయి నార్మల్ కంటే పొడవుగా ఉన్నట్లుగానే కనిపిస్తోంది.
‘‘కియారా చేయి! అది వింతగా, పొడవుగా ఉంది. అంత పొడవుగా ఉండకూడదు. ఏం జరుగుతోంది?" అని ఒక యూజర్ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. "అంటే మేకర్స్ కేవలం ముఖాన్ని మాత్రమే రివీల్ చేశారు. కానీ చేతిని సెట్ చేయలేదు. ఏఐ వాడారా? చాలా వింతగా కనిపిస్తోంది" అని మరొకరు ట్వీట్ చేశారు.
తబాహీ సాంగ్
టాక్సిక్ మూవీ ఫస్ట్ సాంగ్ తబాహీని మార్చి 2న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. యశ్ హీరోగా వస్తున్న ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి గీతు మోహన్ దాస్ డైరెక్టర్. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ లో శ్రుతి మించిన అశ్లీల సన్నివేశం ఉందనే దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}టాక్సిక్ మూవీ ఫస్ట్ సాంగ్ తబాహీని మార్చి 2న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. యశ్ హీరోగా వస్తున్న ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి గీతు మోహన్ దాస్ డైరెక్టర్. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ లో శ్రుతి మించిన అశ్లీల సన్నివేశం ఉందనే దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}