...
...
Next Story

Trisha Engagement: త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న విషయం మీకు తెలుసా.. సినిమాలను వదిలేయమంటే అతన్నే వదిలేశానంటూ..

Trisha Engagement: తమిళ నటుడు దళపతి విజయ్ తో రిలేషన్షిప్ పుకార్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన త్రిషకు ఒకప్పుడు ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న విషయం మీకు తెలుసా? అది ఎందుకు రద్దయిందన్నదానిపై పలు సందర్భాల్లో త్రిష స్పందించింది.

Published on: Mar 14, 2026 08:48 AM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీతా స్వర్ణలింగంతో విడాకులకు దరఖాస్తు చేయడం, ఆ వెంటనే నటి త్రిషతో కలిసి ఒక వివాహ రిసెప్షన్‌లో పాల్గొనడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికం చేశారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో.. గతంలో త్రిష తన నిశ్చితార్థం రద్దు, పెళ్లి, విడాకులపై చేసిన కామెంట్స్ మళ్లీ వెలుగులోకి వచ్చాయి.

నిశ్చితార్థం రద్దుపై త్రిష ఏం చెప్పిందంటే?

Trisha Engagement: త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న విషయం మీకు తెలుసా.. సినిమాలను వదిలేయమంటే అతన్నే వదిలేశానంటూ..
Trisha Engagement: త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న విషయం మీకు తెలుసా.. సినిమాలను వదిలేయమంటే అతన్నే వదిలేశానంటూ..

2015 జనవరిలో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మానియన్‌తో త్రిష కృష్ణన్ నిశ్చితార్థం జరిగింది. అయితే అదే ఏడాది మే నెలలో తాను 'సింగిల్' అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. అప్పట్లో ఆమె నిశ్చితార్థం ఎందుకు రద్దయ్యింది అనే దానిపై ఒక కోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

"నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నన్ను సినిమాల్లో నటించడం మానేయమన్నారు. సినిమాల కోసం నా నిశ్చితార్థానికే ఫుల్‌స్టాప్ పెట్టేశాను. గర్భవతి అయినప్పుడు మాత్రమే సినిమాలకు విరామం తీసుకుంటాను. నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటాను" అని త్రిష అప్పట్లో అన్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ మాటలను త్రిష నిజంగానే అన్నారా లేదా అనేది మాత్రం తెలియలేదు. కానీ 2016లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. "నా నిశ్చితార్థం గురించి వచ్చే వార్తలు బాధ కలిగిస్తాయి. ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం కోసమే అసలు ఏం జరిగిందో నేను బయటపెట్టడం లేదు. ఇలాంటి విషయాల్లో ప్రైవసీని గౌరవించాలి" అని చాలా హుందాగా సమాధానమిచ్చింది.

"విడాకుల కంటే ఒంటరితనమే మిన్న"

విజయ్ భార్య సంగీత వేసిన తన విడాకుల పిటిషన్‌లో ఒక నటితో ఎఫైర్ ఉందనే విషయాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే త్రిషతో కలిసి అతడు బహిరంగంగా కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. వీరిద్దరూ కలిసి గిల్లి (2004), తిరుపాచి (2005), ఆది (2006), కురువి (2008), ఇటీవల లియో (2023) వంటి హిట్ చిత్రాల్లో నటించారు. సుమారు 20 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe