Trisha: విజయ్ ప్రమాణస్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్- ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుందంటూ- మళ్లీ మొదలైన అనుమానాలు!
Trisha First Post After Vijay Oath As Tamil Nadu CM: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం చేసిన చారిత్రాత్మక ఘట్టంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుక అనంతరం త్రిష చేసిన తొలి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. వారి సంబంధంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
Trisha First Post After Vijay Oath As Tamil Nadu CM: చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఆదివారం (మే 10) ఒక అరుదైన రాజకీయ వేడుకకు వేదికైంది. వెండితెరపై దశాబ్దాల పాటు తన నటనతో అలరించిన చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు తారలు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి మాత్రం హీరోయిన్ త్రిష కృష్ణన్పైనే ఉంది. విజయ్తో ఆమెకు ఉన్న రిలేషన్షిప్ నేపథ్యంలో, ఈ వేడుకలో త్రిష సందడి చర్చనీయాంశమైంది.
చారిత్రక వేడుకలో సంప్రదాయ లుక్
త్రిష తన తల్లి ఉమా కృష్ణన్తో కలిసి విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఈ చారిత్రక సందర్భానికి తగ్గట్లుగా ఆమె ఎంతో హుందాగా కనిపించారు. సీ-ఫోమ్ గ్రీన్ కలర్ చీర, బంగారు వర్ణపు ఎంబ్రాయిడరీ ఉన్న క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి సంప్రదాయబద్ధంగా మెరిశారు త్రిష. జుట్టును కొప్పుగా ముడిచి మల్లెపూలు అలంకరించుకుని, ఎర్రటి రాళ్లు పొదిగిన నగలతో త్రిష లుక్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
ప్రేమ గురించి త్రిష ఏమన్నారంటే?
అయితే, విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష చేసిన ఫస్ట్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో త్రిష కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఆ పోస్ట్కు "The love is always louder" (ప్రేమ ఎప్పుడూ బిగ్గరగానే వినిపిస్తుంది) అంటూ త్రిష రాసిన క్యాప్షన్ అభిమానుల్లో రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో, త్రిష చేసిన ఈ కామెంట్ ఏదో అంతరార్థాన్ని సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు.
విజయ్ స్పీచ్కు త్రిష భావోద్వేగం
కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ చేసిన ప్రసంగం స్టేడియంను హోరెత్తించింది. ఆ సమయంలో ప్రేక్షకుల్లో కూర్చున్న త్రిష ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ తన విజన్ను వివరిస్తుంటే, ఆమె కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి.
చెమర్చిన కళ్లతోనే నవ్వుతూ విజయ్ను చూస్తున్న త్రిష వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. వేడుక ముగిసిన తర్వాత బయటకు వస్తున్న సమయంలో అభిమానులు త్రిషను చుట్టుముట్టగా, భద్రతా సిబ్బంది మధ్య ఆమె ప్రశాంతంగా వెళ్లారు. వెళ్లే ముందు విజయ్ తల్లి శోభను కలుసుకుని ఆత్మీయంగా త్రిష హత్తుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
కావాలనే సెటైర్ వేశారా?
ఇక త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన మరో పోస్ట్ కూడా హాట్ టాపిక్ అయింది. "IYKYK" (తెలిసిన వారికి తెలుస్తుంది) అనే పదంతో పాటు "బ్లా బ్లా బ్లా" అని రాసి ఉన్న ఒక కార్టూన్ బొమ్మను ఆమె షేర్ చేశారు. తన గురించి, విజయ్ గురించి వస్తున్న పుకార్లపై త్రిష పరోక్షంగా సెటైర్ వేసినట్లుగా నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
ఇక దళపతి విజయ్ రాజకీయాల్లో బిజీ అవుతుండగా, ఈ నెల చివర్లో ఆయన ఆఖరి చిత్రం 'జన నాయగన్' విడుదల కానుంది. మరోవైపు త్రిష తన కెరీర్లో బిజీగా ఉన్నారు. సూర్య సరసన ఆమె నటించిన 'కరుపు' చిత్రం మే 14, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు?
మే 10, ఆదివారం రోజున చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2. విజయ్ ప్రమాణస్వీకారం తర్వాత త్రిష ఏమని పోస్ట్ చేశారు?
"The love is always louder" (ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుంది) అనే క్యాప్షన్తో త్రిష తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
3. త్రిష తర్వాతి సినిమా ఏది?
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కరుపు' అనే సినిమాలో త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రం మే 14, 2026న విడుదల కానుంది.
4. విజయ్ చివరి సినిమా ఏది?
రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లే ముందు విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' ఈ నెల చివర్లో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


