...
...
Next Story

Vijay Trisha: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే హవా.. విజయ్ ఇంటికి త్రిష.. వీడియో వైరల్

Vijay Trisha: తమిళనాడు అసెంబ్లీ 2026 ఎన్నికల్లో స్టార్ హీరో దళపతి విజయ్ పార్టీ అదరగొడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఏకంగా 116 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి త్రిష వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Published on: May 4, 2026, 13:42:24 IST
Advertisement

Vijay Trisha: తమిళనాడులో విజిల్ మోత మోగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టార్ హీరో దళపతి విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం కొనసాగిస్తోంది. ప్రస్తుతం 116 స్థానాల్లో ఉన్న టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి హీరోయిన్ త్రిష వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ ఇంటికి త్రిష

దళపతి విజయ్, త్రిష
దళపతి విజయ్, త్రిష

తమిళనాడు 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ పేరు ఎంతలా మార్మోగిందో, హీరోయిన్ త్రిష పేరు కూడా అంతలా వినిపించింది. విజయ్, త్రిష మధ్య అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు కలకలం రేపాయి. వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఇంటికి త్రిష వెళ్లడం వైరల్ గా మారింది.

వైరల్ వీడియో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాలు వెలువడుతున్న ఈ రోజే (మే 4) త్రిష పుట్టిన రోజు కావడం గమనార్హం. సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న త్రిష.. మధ్యాహ్నం విజయ్ ఇంటికి వెళ్లింది. విజయ్ సీఎం పీఠంపై కూర్చోవడం ఖాయమైన నేపథ్యంలో అతని ఇంటికి త్రిష వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ కు అభినందనలు చెప్పేందుకు త్రిష అక్కడికి వెళ్లిందని సమాచారం.

విజయ్, త్రిష గురించి

దళపతి విజయ్ తన కెరీర్ పీక్ లో ఉండగానే సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. టీవీకే పార్టీ స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశాడు. ఒంటరిగానే తమిళనాడు అసెంబ్లీ 2026 ఎన్నికల్లో పోటీ చేశాడు. అధికార పార్టీ డీఎంకే.. ఏఐఏడీఎంకే, బీజీపీ కూటమిని సవాళ్లను దాటి విజయ్ అదరగొట్టాడు.

ప్రస్తుతం ఫలితాల ప్రకారం విజయ్ పార్టీ టీవీకే ఏకంగా 116 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ విజయ ఢంకా మోగించి, సీఎం పీఠాన్ని అధిరోహించడం ఖాయమనే చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe