నటిగా కంటే రచయిత్రిగా తనదైన ముద్ర వేసిన హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.. మాతృత్వం అనే ప్రయాణంలోని ఒడిదుడుకులపై తాజాగా మనసు విప్పారు. తన తల్లి డింపుల్ కపాడియాతో తనకున్న అనుబంధం నుంచి, తన కొడుకు ఎదుగుదల వరకు ఆమె పంచుకున్న విషయాలు ప్రతి తల్లిదండ్రుల మనసును తట్టిలేపుతున్నాయి.

పిల్లలు ఎదిగి తమకంటూ ఒక సొంత గుర్తింపును వెతుక్కునే క్రమంలో తల్లిదండ్రుల నుంచి దూరమవ్వడం ఎంత బాధాకరమో, అది అంతే అవసరమని ట్వింకిల్ ఖన్నా విశ్లేషించారు.
తల్లి కళ్లలో ఎప్పుడూ చిన్న పిల్లనే!
తన తల్లి డింపుల్ కపాడియాతో తనకున్న బంధం గురించి ట్వింకిల్ ప్రస్తావిస్తూ.. "తల్లీకూతుళ్ల బంధం ఎప్పుడూ అంత సులభంగా ఉండదు. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, నా వయసు 52 ఏళ్లయినా మా అమ్మ కళ్లలో నేను ఎప్పటికీ ఆ అమాయకపు చిన్న పిల్లనే. నాకు లోకజ్ఞానం తక్కువని ఆవిడ భావన. అందుకే ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది" అని సరదాగా పేర్కొన్నారు.
దూరం పెరిగినా.. ప్రేమ తరగదు
కుమారుడు ఆరవ్ కుమార్ ఇరవై ఏళ్ల వయసులోకి వచ్చిన తర్వాతే మాతృత్వంలోని అసలైన సవాళ్లు అర్థమయ్యాయని ట్వింకిల్ వివరించారు. "పిల్లలు యుక్తవయసులోకి రాగానే తల్లిదండ్రుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి తలుపులు నిర్మించుకుంటారు. ఆ తలుపుల నుంచి మనం తొంగి చూడొచ్చు కానీ, ప్రవేశం మాత్రం అంత సులభం కాదు" అని ట్వింకిల్ ఖన్నా తెలిపారు.
అస్విత్వం కోసే చేసే పోరాటం
"వారి సొంత అస్తిత్వం కోసం చేసే ఈ పోరాటం తల్లికి ఎంత నొప్పినిస్తుందో నాకు ఇప్పుడు తెలుస్తోంది. వారిని పట్టుకోవాలనే ఆరాటం ఒకవైపు, స్వేచ్ఛగా వదిలేయాల్సిన బాధ్యత మరోవైపు.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే మనసుకు కేవలం ఒక మెసేజ్ లేదా సెలవుల్లో కలిసి గడిపే క్షణాలు మాత్రమే ఊరటనిస్తాయి" అని ట్వింకిల్ ఖన్నా భావోద్వేగంగా రాశారు.
ఈ వారం కాలమ్ చాలా బాగుంది
{{/usCountry}}"వారి సొంత అస్తిత్వం కోసం చేసే ఈ పోరాటం తల్లికి ఎంత నొప్పినిస్తుందో నాకు ఇప్పుడు తెలుస్తోంది. వారిని పట్టుకోవాలనే ఆరాటం ఒకవైపు, స్వేచ్ఛగా వదిలేయాల్సిన బాధ్యత మరోవైపు.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే మనసుకు కేవలం ఒక మెసేజ్ లేదా సెలవుల్లో కలిసి గడిపే క్షణాలు మాత్రమే ఊరటనిస్తాయి" అని ట్వింకిల్ ఖన్నా భావోద్వేగంగా రాశారు.
ఈ వారం కాలమ్ చాలా బాగుంది
{{/usCountry}}ట్వింకిల్ రాసిన ఈ కథనంపై ఆమె భర్త, స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. "ఈ వారం కాలమ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ ముగింపు చదువుతుంటే మా అమ్మ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి" అని ఎక్స్ (X) వేదికగా రాసుకొచ్చారు.
ఫ్యాషన్ రంగం వైపు ఆరవ్ అడుగులు
అక్షయ్, ట్వింకిల్ దంపతులకు 2002లో ఆరవ్ జన్మించారు. గత ఏడాది ఆరవ్ 23వ పుట్టినరోజు జరుపుకున్నారు. తన తండ్రిలా సినిమా రంగంలోకి రావడానికి ఆరవ్ ఆసక్తి చూపడం లేదని అక్షయ్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఆరవ్ ప్రస్తుతం లండన్లో ఫ్యాషన్ డిజైనింగ్పై దృష్టి సారించారు. గతేడాది ఆరవప్ 23వ పుట్టినరోజు సందర్భంగా ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ.. "పిల్లలు మనం పీల్చే గాలి లాంటి వారు. కొద్దిసేపు మన ఊపిరితిత్తుల్లో ఉన్నా, తర్వాతి క్షణంలో విడిచిపెట్టక తప్పదు" అని ఒక అద్భుతమైన పోలికతో కొడుకుపై తనకున్న ప్రేమని చాటుకున్నారు.
టూ మచ్ టాక్ షోతో
వృత్తిపరంగా చూస్తే, ట్వింకిల్ ఖన్నా గతేడాది తన 'మిసెస్ ఫన్నీబోన్స్ రిటర్న్స్' పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే కాజోల్తో కలిసి నిర్వహించిన 'టూ మచ్' అనే ఓటీటీ టాక్ షోతో బుల్లితెర, డిజిటల్ ప్రేక్షకులను కూడా అలరించారు.