మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఈ శుభవార్తను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా అనౌన్స్ చేశాడు. అయితే తాజాగా ఉపాసన తన ఎక్స్ అకౌంట్లో డెలివరీ రోజు జరిగిన సంఘటనలతో కూడిన ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో చరణ్, ఉపాసన ఆసుపత్రిలోకి అడుగుపెట్టడం, కుటుంబ సభ్యుల ఉద్వేగం స్పష్టంగా కనిపిస్తోంది.
తాతయ్యగా చిరు సంబరమే వేరు..

వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మనవడు, మనవరాలి రాకపట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆసుపత్రిలో ఎంతో ఓపికగా ఎదురుచూసిన అతడు.. పిల్లలు పుట్టగానే బయటకు వచ్చి శుభవార్త చెప్పాడు. "చాలా కాలంగా, ఎంతోమంది ఇలాంటి శుభఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక బాబు, ఒక పాప మా కుటుంబంలోకి వచ్చారు" అని చిరంజీవి ప్రకటించడం వీడియోలో హైలైట్. ఈ శుభవార్త తెలియగానే ఆసుపత్రి బయట అభిమానులు గులాబీ, నీలం రంగు బెలూన్లను గాలిలోకి వదిలి, డ్యాన్సులు చేస్తూ పండగ చేసుకున్నారు.
ఉపాసన ఎమోషనల్ పోస్ట్..
ఈ వీడియోను షేర్ చేస్తూ ఉపాసన ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. "ఈ వీడియో చూసిన ప్రతిసారీ నా గుండె నిండినట్లు అనిపిస్తుంది. మా చుట్టూ ఉన్న ప్రేమ, బలం, పాజిటివిటీకి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. తేజస్వి, మొత్తం అపోలో టీమ్ మాకు అందించిన సేవలు వెలకట్టలేనివి. చరణ్ అభిమానుల ప్రేమ స్వచ్ఛమైనదని నాకు తెలుసు. అయితే మా పిల్లల భద్రతను, ప్రైవసీని మీరు గౌరవిస్తారని, వారిని ఎప్పుడూ కాపాడతారని నేను నమ్ముతున్నాను" అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా తమ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
విశేషమేమిటంటే.. తమ మొదటి కూతురు క్లిన్ కారా కొణిదెల పుట్టిన అదే డెలివరీ గదిలోనే, ఇప్పుడు కవలలు కూడా జన్మించారు. ఆ విషయం వీడియోలో చెప్పడం చూడొచ్చు.
రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే..
{{/usCountry}}విశేషమేమిటంటే.. తమ మొదటి కూతురు క్లిన్ కారా కొణిదెల పుట్టిన అదే డెలివరీ గదిలోనే, ఇప్పుడు కవలలు కూడా జన్మించారు. ఆ విషయం వీడియోలో చెప్పడం చూడొచ్చు.
రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే..
{{/usCountry}}రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్లో పెళ్లి చేసుకున్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డికి ఉపాసన మనవరాలు అన్న విషయం తెలిసిందే. 2023 జూన్లో వీరికి మొదటి సంతానంగా క్లిన్ కారా జన్మించింది. ఇప్పుడు కవలలతో మెగా ఇంట సందడి రెట్టింపయ్యింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటించిన చివరి మూవీ 'గేమ్ ఛేంజర్' గతేడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల లోపు వసూళ్లతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' (Peddi) అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.