Uppal Balu: ఉప్పల్ బాలు తెలుసు కదా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తెలుగు వాళ్లకు సుపరిచితుడే. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి అగ్నిపరీక్ష కోసం వచ్చిన అతనికి నవదీప్ షాకిచ్చాడు. స్టేజీపైనా అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారా.. నీది చీప్ ఎంటర్టైన్మెంట్ అని అని అనడంతోపాటు అతన్ని సెలెక్ట్ చేయలేదు. దీంతో ఉప్పల్ బాలు బూతులు తిడుతూ నవదీప్ పై చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
నీది నువ్వు చూసుకోరా నవదీప్: ఉప్పల్ బాలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం వెళ్లిన ఉప్పల్ బాలును ఈ షో ముగ్గురు జడ్జీలు అయిన నవదీప్, బిందు మాధవి, అభిజీత్ నో చెప్పారు. ఆ తర్వాత అతడు ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
“హాయ్ గయ్స్ మీరు చూశారు కదా ఎపిసోడ్.. స్టేజీపైకి పిలిచారు ఒక టాస్క్ ఇవ్వలేదు.. పాడివ్వలేదు.. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండరా అని ఆమె అడిగింది.. ఈయననేమో నీకు ఫ్యాన్స్ ఉన్నరా.. ఉన్నారని అనుకుంటున్నావా అని అన్నాడు.. మనుషులకు ఫ్యాన్స్ ఉండరా.. నువ్వు తోపువని నీకే ఉంటరా ఫ్యాన్స్.. ఇంత అవమానించడం మీరు చూశారు కదా.. నేను ఉన్నదే చెప్పాను.. అభిజీత్ గారు గ్రీన్ ఇవ్వబోతే రెడ్ ఇప్పించారు.. నీకెందు రా నవదీప్.. నీది నువ్వు చూసుకో.. నీ వల్లే నా జీవితం ఖరాబైంది.. నీకేం అన్యాయం చేశాను” అని ఆ వీడియోలో ఉప్పల్ బాలు నిలదీశాడు.
అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష శనివారం (ఆగస్ట్ 15) నుంచి ప్రారంభమైన విషయం తెలుసు కదా. అయితే హౌస్ లోకి వెళ్దామని ఆశతో వచ్చిన ఉప్పల్ బాలుకి అవమానం జరిగింది. స్టేజ్ పైకి తనను పిలిచిన తర్వాత తాను బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఎంతో మంది తన ఫ్యాన్స్ మెసేజులు చేస్తున్నారని ఉప్పల్ బాలు చెప్పాడు.
దీనికి నవదీప్ స్పందిస్తూ.. అసలు నీకు నిజంగానే ఫ్యాన్స్ ఉన్నారా.. ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా.. నీ నుంచి చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు అన్నది నా ఫీలింగ్ అని అన్నాడు. అటు బిందు మాధవి అయితే మీరు ట్రాన్స్జెండరా అని నేరుగా అడిగేసింది. మిమ్మల్ని హౌస్ లోకి పంపించడం మాకైతే ఇష్టం లేదంటూ నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ముగ్గురూ రెడ్ కార్డు చూపించారు.
నవదీప్పై ట్రోలింగ్
{{/usCountry}}దీనికి నవదీప్ స్పందిస్తూ.. అసలు నీకు నిజంగానే ఫ్యాన్స్ ఉన్నారా.. ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా.. నీ నుంచి చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు అన్నది నా ఫీలింగ్ అని అన్నాడు. అటు బిందు మాధవి అయితే మీరు ట్రాన్స్జెండరా అని నేరుగా అడిగేసింది. మిమ్మల్ని హౌస్ లోకి పంపించడం మాకైతే ఇష్టం లేదంటూ నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ముగ్గురూ రెడ్ కార్డు చూపించారు.
నవదీప్పై ట్రోలింగ్
{{/usCountry}}ఇది చూసిన తర్వాత సోషల్ మీడియాలో నవదీప్ పై ట్రోలింగ్ మొదలైంది. స్టేజీపైకి పిలిచి ఇలా అవమానిస్తారా అంటూ కొందరు తీవ్రంగా మండిపడ్డారు. నవదీప్ పై ఇన్నాళ్లూ కాస్త మర్యాద ఉండేదని, ఇప్పుడది పోయిందని ఓ యూజర్ ట్వీట్ చేశారు. మనుషులను మనుషుల్లాగా చూడండి.. స్టేజీపైకి పిలిచి ఇలా వ్యక్తిత్వ హననం చేస్తారా అంటూ మరొకరు వీడియో వదిలారు.
నిజానికి అంతకుముందు నుంచే నవదీప్, ఉప్పల్ బాలు మధ్య వార్ నడుస్తోంది. ఉప్పల్ బాలును ఇమిటేట్ చేస్తూ నవదీప్ చేసిన ఓ రీల్ కూడా బాగా వైరల్ అయింది. దీనిపైనా చాలా మంది అతనిపై నెగటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ అగ్నిపరీక్ష ఎపిసోడ్ తో ఉప్పల్ బాలుకు మద్దతు మరింత పెరుగుతోంది.