Vadhandhi Season 2 OTT Release Date: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు అమేజాన్ ప్రైమ్ వీడియో తీపి కబురు అందించింది. తమిళంలో రూపొంది, తెలుగులోనూ విశేష ఆదరణ దక్కించుకున్న ప్రతిష్టాత్మక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ 'వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని' రెండో భాగానికి రంగం సిద్ధమైంది.
ఓటీటీలోకి వదంది 2

మొదటి సీజన్తో ఓటీటీ ప్రపంచంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన ఈ సిరీస్ నుంచి 'వదంది సీజన్ 2' త్వరలోనే రాబోతున్నట్లు నిర్వాహకులు అధికారికంగా తాజాగా వెల్లడించారు.
యువతి దారుణ హత్య చుట్టూ
తమిళ సినీ రంగంలో 'విక్రమ్-వేద', 'సుడల్' వంటి సూపర్ హిట్ ప్రాజెక్టులు అందించిన ప్రసిద్ధ ద్వయం పుష్కర్-గాయత్రి తమ 'వాల్వాచర్ ఫిల్మ్స్' బ్యానర్పై ఈ సిరీస్ను నిర్మించారు. ఆండ్రూ లూయిస్ సృష్టించి, దర్శకత్వం వహించిన ఈ కథ ఒక యువతి దారుణ హత్య చుట్టూ అల్లుకున్న వదంతులు, సమాజపు కోణాలు, పోలీసు విచారణను అత్యంత ఉత్కంఠభరితంగా చూపించనుంది.
'వదంది' అంటే ఏమిటి? అసలు కథేంటి?
తమిళ భాషలో 'వదంది' అంటే వదంతు లేదా పుకారు అని అర్థం. కన్యాకుమారి అందాల నేపథ్యంతో సాగే ఈ కథలో వెలోని (సంజన కృష్ణమూర్తి) అనే యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేస్ను ఛేదించడానికి రంగంలోకి దిగిన నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి వివేక్ (ఎస్.జె. సూర్య) ఎదుర్కొన్న సవాళ్లు ఈ సిరీస్ ప్రధానాంశం.
నిజాలు తెలుసుకోకుండా
ఒక దారుణం జరిగినప్పుడు నిజాలు తెలుసుకోకుండా సమాజం ఎలాంటి రూమర్లు అల్లుతుంది, ఒక మహిళ పట్ల ప్రజల ఆలోచనా తీరు ఎలా ఉంటుందనే అంశాలను దర్శకుడు ఎంతో లోతుగా స్పృశించారు. "వదంతులు నిజం కంటే వేగంగా ప్రయాణిస్తాయి. విచారణలో వెలుగు చూసే నిజాన్ని సైతం సమాజం తనలోని అపనమ్మకాలతో ఎలా మార్చేస్తుందో ఈ సిరీస్ అద్భుతంగా చూపించింది" అని సినీ విమర్శకులు కొనియాడారు.
ఎస్.జె.సూర్య నటన.. మేకర్స్ మ్యాజిక్
తెలుగు ప్రేక్షకులకు 'ఖుషి' దర్శకుడిగా, 'సరిపోదా శనివారం', 'స్పైడర్' చిత్రాల్లో నటుడిగా ఎస్జే సూర్య ఎంతో సుపరిచితుడు. డిజిటల్ వేదికపై ఆయన అడుగుపెట్టిన తొలి ఓటీటీ సిరీస్ 'వదంది' కావడం విశేషం. పోలీస్ ఆఫీసర్ వివేక్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు సీనియర్ నటుడిగా ఆయన ప్రతిభకు అద్దం పడుతుంది.
ఎస్జే సూర్యకు బదులు శశికుమార్
{{/usCountry}}తెలుగు ప్రేక్షకులకు 'ఖుషి' దర్శకుడిగా, 'సరిపోదా శనివారం', 'స్పైడర్' చిత్రాల్లో నటుడిగా ఎస్జే సూర్య ఎంతో సుపరిచితుడు. డిజిటల్ వేదికపై ఆయన అడుగుపెట్టిన తొలి ఓటీటీ సిరీస్ 'వదంది' కావడం విశేషం. పోలీస్ ఆఫీసర్ వివేక్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు సీనియర్ నటుడిగా ఆయన ప్రతిభకు అద్దం పడుతుంది.
ఎస్జే సూర్యకు బదులు శశికుమార్
{{/usCountry}}లైలా, నాజర్, వివేక్ ప్రసన్న, స్మృతి వెంకట్ వంటి నటీనటులు తమ నటనతో ఈ సిరీస్ను మరో స్థాయికి తీసుకెళ్లారు. తొలి భాగం ముగింపు తర్వాత మళ్లీ వివేక్ పాత్ర ఏ కొత్త కేసుతో రాబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, వివేక్ పాత్రలో ఈసారి ఎస్జే సూర్యకు బదులు తమిళ పాపులర్ నటుడు శశికుమార్ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారు.
వదంది 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
అంటే, హీరో మారాడు, కథ మారిందని తెలుస్తోంది. పుష్కర్-గాయత్రి శైలికి తగినట్లుగా కథలో లోతైన సామాజిక కోణాలు, ఉత్కంఠభరితమైన సీన్లు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఫస్ట్ సీజన్లాగే అమెజాన్ ప్రైమ్లో వదంది ది మిస్టరీ ఆఫ్ మణి ఓటీటీ రిలీజ్ అవనుంది. ఆగస్ట్ 7 నుంచి వదంది 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా వెల్లడించారు మేకర్స్.