...
...
Next Story

సీక్రెట్స్ చూసే కళ్ల డాక్టర్-నేరుగా ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకో థ్రిల్లర్ సిరీస్-అదిరిపోయిన ట్రైలర్-స్ట్రీమింగ్ డేట్ ఇదే

టాలీవుడ్ లో హీరోగా వరుస ఫ్లాప్ లు అందుకుంటున్న వరుణ్ సందేశ్ రూట్ మార్చాడు. ఇప్పుడు ఓటీటీ బాట పట్టాడు. నేరుగా ఓటీటీలోకి రాబోతున్న నయనం అనే సైకో సిరీస్ తో డిజిటల్ ఆడియన్స్ ను కలవడానికి వచ్చేస్తున్నాడు. ఇవాళ రిలీజ్ చేసిన ఈ సిరీస్ ట్రైలర్ అదిరిపోయింది.

Published on: Dec 9, 2025, 12:39:23 IST
Advertisement

ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతుంది. ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా సస్పెన్స్, ఉత్కంఠతో కూడిన సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే నయనం వెబ్ సిరీస్. ఇందులో వరుణ్ సందేశ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. పెద్ద తెరపై విజయాలు అందుకోలేకపోతున్న వరుణ్.. రూటు మార్చి చిన్న తెరపైకి వస్తున్నాడు. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది.

ఓటీటీలో నయనం

నయనం వెబ్ సిరీస్ పోస్టర్ (x/ZEE5Telugu)
నయనం వెబ్ సిరీస్ పోస్టర్ (x/ZEE5Telugu)

సైకో థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కిన నయనం వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. మంగళవారం (డిసెంబర్ 9) ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో వరుణ్ సందేశ్ షేడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో డిసెంబర్ 19న నేరుగా రిలీజ్ కానుంది. ఇది 6 ఎపిసోడ్ల సిరీస్ గా రానుంది.

నయనం ట్రైలర్

హైదరాబాద్ లో ఇవాళ నయనం సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. యూట్యూబ్ లో రిలీజైన ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఈ సిరీస్ లో వరుణ్ సందేశ్ కంటి డాక్టర్ గా నటిస్తున్నాడు. ఇతరులు కళ్లద్దాల నుంచి నాలుగు నిమిషాల పాటు వాళ్లు చూసేది తాను చూడగలనని వరుణ్ క్యారెక్టర్ చెప్తుంది. అందుకోసం స్పెషల్ గా ఓ కళ్లద్దాలు డిజైన్ చేస్తాడు.

అమ్మాయితో లవ్

ఓ అమ్మాయి కళ్లను చూసి డాక్టర్ లవ్ లో పడతాడు. హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ నటించింది. అయితే ఆమెకు భర్త ఉన్నడనే విషయం తెలుస్తుంది. అతను హత్యకు గురవుతాడు. ఈ హత్యను ఎంక్వైరీ చేయడానికి పోలీస్ ఆఫీసర్ గా అలీ రెజా రంగంలోకి దిగుతాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? వరుణ్ సందేశ్ దాచిన రహస్యాలు ఏంటీ? అన్నది సిరీస్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

లేడీ డైరెక్టర్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks