...
...
Next Story

Wife Jokes: బెడిసికొట్టిన విక్కీ కౌశల్ పెళ్లి జోకులు- నెటిజన్ల ఫైర్- ప్రమాదకర లక్షణాలు, కత్రినా కైఫ్‌ను అవమానించడమేనంటూ!

Vicky Kaushal Jokes On Marriage And Wife: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ఒక పెళ్లి వేడుకలో భార్యలు, పెళ్లి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. పెళ్లయిన వారిలో జోష్ తగ్గిపోతుందంటూ విక్కీ కౌశల్ చేసిన జోకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రమాదకర లక్షణాలు ఉన్నాయంటున్నారు.

Published on: Mar 18, 2026, 06:26:54 IST
Advertisement

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్. ఒకరిపై ఒకరు కురిపించుకునే ప్రేమతో ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే ఈ జంట గురించి ఇప్పుడు ఒక నెగెటివ్ చర్చ మొదలైంది. ఒక పెళ్లి వేడుకలో విక్కీ కౌశల్ సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను వివాదంలోకి నెట్టాయి.

ఏం మాట్లాడారు? ఎందుకు ఇంత రచ్చ?

బెడిసికొట్టిన విక్కీ కౌశల్ పెళ్లి జోకులు- నెటిజన్ల ఫైర్- ప్రమాదకర లక్షణాలు, కత్రినా కైఫ్‌ను అవమానించడమేనంటూ!
బెడిసికొట్టిన విక్కీ కౌశల్ పెళ్లి జోకులు- నెటిజన్ల ఫైర్- ప్రమాదకర లక్షణాలు, కత్రినా కైఫ్‌ను అవమానించడమేనంటూ!

ఇటీవల ఒక వివాహ వేడుకకు హాజరైన విక్కీ కౌశల్, అక్కడ పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడుతూ తనదైన శైలిలో 'హౌ ఈజ్ ద జోష్' అంటూ సందడి చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే విమర్శలకు దారితీశాయి.

పెళ్లయిన వారిలో తగ్గిపోతుంది

"నేను గమనించింది ఏంటంటే.. బ్యాచిలర్స్‌లో జోష్ ఎప్పుడూ హైగానే ఉంటుంది. కానీ మా లాంటి పెళ్లయిన వారిలో మాత్రం ఏటా ఆ జోష్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ కంగారు పడకండి.. నాలుగు రోజుల్లోనే ఆ జోష్ ఏమీ తగ్గిపోదు" అని విక్కీ కౌశల్ చమత్కరించారు.

"ఇది 2026.. ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి జోకులేనా?"

విక్కీ కౌశల్ వేసిన పెళ్లి జోకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విక్కీపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మహిళా నెటిజన్లు విక్కీ కౌశల్ తీరును తప్పుబడుతున్నారు.

ఇలాంటి పిచ్చి జోకులను

"మనం ఇప్పుడు 2026లో ఉన్నాం.. ఇప్పటికీ ఆ పాతకాలపు భార్య-భర్తల జోకులేనా? ఇలాంటి పిచ్చి జోకులను 2016లోనే 'కామెడీ నైట్స్ విత్ కపిల్' షోలోనే వదిలేయాల్సింది" అని ఒక యూజర్ ఘాటుగా స్పందించారు.

పరోక్షంగా భార్యను అవమానించడమే

ఇలా ఎప్పుడు పాజిటివిటీ తెచ్చుకునే విక్కీ కౌశల్ తొలిసారి నెగెటివ్ ముద్ర వేసుకున్నాడు. ఇదిలా ఉంటే, ఒక అవార్డు వేడుకలో "ముజ్ సే షాదీ కరోగీ?" (నన్ను పెళ్లి చేసుకుంటావా?) అని కత్రినా కైఫ్‌ను విక్కీ కౌశల్ అడిగిన సరదా ప్రశ్న వారి ప్రేమాయణానికి పునాది వేసింది.

ఉదయ్‌పూర్‌లో వివాహం

2021 డిసెంబర్ 9న ఉదయ్‌పూర్‌లో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతేడాది నవంబర్‌లో ఈ దంపతులకు 'విహాన్ కౌశల్' అనే కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ తల్లిదండ్రులుగా కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో విక్కీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఇమేజ్‌కు కొంత డ్యామేజ్ కలిగిస్తాయేమో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe