విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి ముగిసింది. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకతో తమ పెళ్లి ఈవెంట్లను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కంప్లీట్ చేసుకున్నారు. దీంతో ఇక అండర్ గ్రౌండ్ వెళ్లిపోతామని విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
గ్రాండ్ గా రిసెప్షన్

విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, కేటీఆర్, కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ రిసెప్షన్ కు వచ్చారు. బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో ఈ వేడుక జరిగింది.
విజయ్ కామెంట్లు
తమ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. రిసెప్షన్ చివర్లో అందరికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న థ్యాంక్స్ చెప్పారు. ‘‘అందరికీ థ్యాంక్స్. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ రోజు మేం సెలబ్రేషన్స్ ముగించాం. ఇక ఎలాంటి సందడి లేకుండా అండర్ గ్రౌండ్ వెళ్లిపోతాం’’ అని విజయ్ దేవరకొండ అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న రష్మిక క్యూట్ గా నవ్వేసింది.
విరోష్ వెడ్డింగ్ బిజీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఇన్వైట్ చేశారు. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ సొంత ఊరికి విరోష్ జోడీ వెళ్లింది. అక్కడ నూతన గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
ఫ్యాన్స్ తో కలిసి
{{/usCountry}}విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఇన్వైట్ చేశారు. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ సొంత ఊరికి విరోష్ జోడీ వెళ్లింది. అక్కడ నూతన గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
ఫ్యాన్స్ తో కలిసి
{{/usCountry}}తన సొంత ఊరు గ్రామస్థులకు విజయ్ దేవరకొండ విందు భోజనం పెట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. చివరగా మార్చి 4న వెడ్డింగ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
హనీమూన్?
పెళ్లి సందడి ముగించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇక హనీమూన్ కు వెళ్లబోతున్నారని తెలిసింది. మరి వీళ్లు ఎక్కడికి వెళ్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ఈ జంట ఒకసారి మాల్దీవ్స్ వెళ్లింది. మరి ఇప్పుడు భార్యాభర్తలుగా మళ్లీ మాల్దీవ్స్ కే వెళ్తారా? లేదా ఇంకేమైనా ప్లాన్ చేశారా? అన్నది వేచి చూడాల్సిందే.