Vijay Rashmika Wedding Pics: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన విజయ్, రష్మిక.. నా ప్రాణ స్నేహితురాలినే భార్యను చేసుకున్నానంటూ..

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (Vijay Rashmika Wedding Pics) తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రపంచంలోని ఆనందమంతా వీళ్ల ముఖాల్లోనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఫొటోల్లో రష్మిక ఎంతో సంతోషంగా కనిపించింది. భర్తకు ప్రేమగా ముద్దివ్వడం చూడొచ్చు.

Published on: Feb 26, 2026, 19:08:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఆ సంతోషకరమైన జంటకే కాకుండా, గత ఎనిమిదేళ్లుగా విజ్జు, రుషీలు కలవాలని కోరుకుంటున్న వారి అభిమానులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చిన రోజు. చాలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ కొత్త దంపతులు ఎట్టకేలకు తమ అందమైన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

Vijay Rashmika Wedding Pics: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన విజయ్, రష్మిక.. నా ప్రాణ స్నేహితురాలినే భార్యను చేసుకున్నానంటూ..
Vijay Rashmika Wedding Pics: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన విజయ్, రష్మిక.. నా ప్రాణ స్నేహితురాలినే భార్యను చేసుకున్నానంటూ..

విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

విజయ్ దేవరకొండ తన పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. "ఒకరోజు, నేను ఆమెను చాలా గుర్తు చేసుకున్నాను. ఆమె నా పక్కన ఉంటే నా రోజు ఇంకా బాగుండేది అనిపించేంతగా గుర్తు చేసుకున్నాను. ఆమె నా ముందు కూర్చుంటే నా భోజనం మరింత సంపూర్ణంగా అనిపించేది. ఆమె నాతో కలిసి వర్కౌట్స్ చేస్తే, అది ఒక శిక్షలా కాకుండా మరింత సరదాగా ఉండేది. నేను ఎక్కడ ఉన్నా సరే.. ఒక ఇల్లు, ప్రశాంతత అనే భావన కలగడానికి నాకు ఆమె అవసరం అనిపించింది. అందుకే నా ప్రాణ స్నేహితురాలిని.. నా భార్యను చేసుకున్నాను. 26.02.2026" అని రాసుకొచ్చాడు.

రష్మిక ప్రేమపూర్వక లేఖ

మరోవైపు రష్మిక కూడా స్పందిస్తూ.. "హాయ్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను 'నా భర్త'ను! శ్రీ విజయ్ దేవరకొండ!! నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి, ప్రశాంతంగా ఉండటం అంటే ఏమిటో నాకు చూపించిన వ్యక్తి! పెద్ద కలలు కనడం తప్పు కాదని ప్రతిరోజూ నాకు చెబుతూ, నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సాధించగల సామర్థ్యం నాకు ఉందని నిరంతరం ప్రోత్సహించిన వ్యక్తి! స్నేహితులతో కలిసి ప్రయాణించడం ఎంతో ఉత్తమమైన విషయం అని నాకు చూపించిన వ్యక్తి.. నమ్మండి.. ఈ మనిషి గురించి నేను ఏకంగా ఒక పుస్తకమే రాయగలను.. నేను ఎప్పుడూ కలలు కన్న మహిళగా మారాను.. ఎందుకంటే ఆవిడను ఈరోజు ఇలా తీర్చిదిద్దింది మీరే.. విజ్జూ, నీపై నాకున్న భావాలను వర్ణించడానికి నాకు ఎప్పుడూ మాటలు చాలవు.. నేను ఎప్పుడూ నీకు ఆ విషయం చెబుతూనే ఉంటాను.. కానీ తెలుసా.. అకస్మాత్తుగా నా విజయాలు, పోరాటాలు, సంతోషం, బాధ, ఆనందం, జీవితం - అన్నీ ఇప్పుడు మరింత అర్థవంతంగా మారాయి.. దానికి కారణం నువ్వు నా సొంతం కావడమే - వీటన్నింటినీ చూస్తూ.. వీటన్నింటిలో అతిపెద్ద భాగం కావడమే.. నీ భార్య కావడం, నీ భార్యగా ఉండటం, నీ భార్యగా పిలిపించుకోవడం నాకు చాలా చాలా చాలా చాలా చాలా ఉత్సాహంగా ఉంది.. ఇది పూర్తిగా సంబరాలు చేసుకునే సమయం.. మనం కలిసి అత్యుత్తమమైన జీవితాన్ని గడుపుదాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటూ ఓ సుదీర్ఘమైన క్యాప్షన్ ఉంచింది.

రెండు సంప్రదాయాల్లో వివాహం

గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం పదకొండున్నర గంటలకు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సాంప్రదాయ తెలుగు హిందూ ఆచారాల ప్రకారం ఒక్కటయ్యారు. పూలమాలలు మార్చుకునే సమయంలో తమ అద్భుతమైన ప్రేమకథలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్, రష్మికలు ఆనందభాష్పాలు రాల్చారు.

ఆ తర్వాత వధువు మూలాలను గౌరవిస్తూ సాయంత్రం వేళ ఈ దంపతులు సాంప్రదాయ కొడవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. విజయ్ తల్లి మాధవి దేవరకొండ బహుమతిగా ఇచ్చిన అందమైన చీరను రష్మిక ధరించారని తెలిసింది.

విజయ్, రష్మిక తమ వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్నప్పటికీ, పెళ్లి వేదిక వెలుపల ఉన్న ఫొటోగ్రాఫర్లను గుర్తించి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. మొదటి వివాహ వేడుక ముగిసిన తర్వాత వధూవరుల బృందాలు ఫొటోగ్రాఫర్లకు, స్థానికులకు మిఠాయిలు పంచిపెట్టారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More