విరోష్ వెడ్డింగ్ ఇటీవల రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను రష్మిక మందన్న ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి కాసేపు ముచ్చటించారు.

రష్మిక మందన్నకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి, కానుక ఇచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు రష్మికను దీవించారు. విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ఆహ్వానం అందాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని రష్మిక కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'సినీ నటుడు విజయ్ దేవరకొండతో ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సినీ నటి రష్మిక కలిసి, తమ వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించారు.' అని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఫ్యాన్స్కు రిక్వెస్ట్
మరోవైపు హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో అభిమానులకు విరోష్ జంట విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో 4వ తేదీన సాయంత్రం జరిగే రిసెప్షన్ వేడుక సజావుగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా జరగాలంటే ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా వేడుకకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దని కోరారు.
{{/usCountry}}మరోవైపు హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో అభిమానులకు విరోష్ జంట విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో 4వ తేదీన సాయంత్రం జరిగే రిసెప్షన్ వేడుక సజావుగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా జరగాలంటే ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా వేడుకకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దని కోరారు.
{{/usCountry}}సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు రిసెప్షన్కు హాజరుకానున్నారు. దీంతో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని విరోష్ జంట కోరింది. అభిమానులు, శ్రేయోభిలాషులు క్షేమమే తమకు ముఖ్యమని తెలిపింది. మీరు ఎక్కడున్నా.. మీ దీవెనలు మాకు ఉంటాయని ఆశిస్తున్నట్టుగా పేర్కొంది.
జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్కు విరోష్ జంట
ఈ కొత్త జంట జూబ్లీహిల్స్లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నూతన జీవితం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. స్వామివారిని దర్శించుకున్నారు. విజయ్ దేవరకొండ సంప్రదాయబద్ధమైన కుర్తాలో కనిపించగా.. రష్మిక పట్టుచీరలో మెరిసిపోయారు. వీరితోపాటుగా ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. దర్శనం తర్వాత ఆలయ అర్చకులు ఈ జంటకు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు, అభిమానులకు మిఠాయిలు పంచారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.