...
...
Next Story

Wedding of VIROSH: రష్మిక మెడలో విజయ్ తాళి కట్టే టైమ్ ఇదే.. ముహూర్తం ఫిక్సయింది.. రెండు సాంప్రదాయాల్లో పెళ్లి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి (Wedding of VIROSH) ముహూర్తం ఖరారైంది. గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్‌పూర్ లో వీళ్ల పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఉదయం 8 గంటలకు రష్మిక మెడలో విజయ్ తాళి కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published on: Feb 25, 2026, 14:31:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరికొన్ని గంటల్లోనే భార్యాభర్తలు కాబోతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 24) వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభం కాగా.. గురువారం అంటే ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరు ఏ సమయానికి పెళ్లి పీటలెక్కబోతున్నారు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ జంటకు అత్యంత సన్నిహితులైన వర్గాలు హిందుస్థాన్ టైమ్స్‌కు ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాయి.

విజయ్, రష్మికల ముహూర్తం సమయం ఫిక్స్

Wedding of VIROSH: రష్మిక మెడలో విజయ్ తాళి కట్టే టైమ్ ఇదే.. ముహూర్తం ఫిక్సయింది.. రెండు సాంప్రదాయాల్లో పెళ్లి
Wedding of VIROSH: రష్మిక మెడలో విజయ్ తాళి కట్టే టైమ్ ఇదే.. ముహూర్తం ఫిక్సయింది.. రెండు సాంప్రదాయాల్లో పెళ్లి

రష్మిక, విజయ్ తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ఉదయ్‌పూర్‌లో ప్రారంభించి, దానికి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో కస్టమ్-మేడ్ ఫీల్డ్ మార్కెట్స్, 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని రాసి ఉన్న పాప్‌కార్న్ బకెట్స్, ఒక పూల్ గేమ్ అభిమానులకు కనిపించాయి. కానీ వారు చూడనిది మరొకటి ఉంది.. అదే వారి సంగీత్ వేడుక. ఈ వేడుకలో వారిద్దరూ ఇన్నేళ్లుగా కలిసి ఉన్న ఫోటోలను వేదిక అంతటా ఎంతో అందంగా అలంకరించారు.

బుధవారం (ఫిబ్రవరి 25) నాడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో హల్దీ, మెహందీ వేడుకలు జరగనున్నాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక వివాహం విషయానికొస్తే ఉదయం 8 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. విజయ్, రష్మికల మూలాలను గౌరవిస్తూ.. ఈ వివాహం అటు తెలుగు, ఇటు కొడవ సంప్రదాయాల ప్రకారం జరగనుంది.

అతిథుల జాబితాలో సినీ ప్రముఖులు

సోమవారం (ఫిబ్రవరి 23) ఉదయం రష్మిక, విజయ్, అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ, వారి స్నేహితులు హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్తూ కనిపించారు. మంగళవారం నాటికి అతిథులు కూడా నగరానికి చేరుకోవడం ప్రారంభించారు.

బుధవారం నాడు 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో పాటు.. విరోష్ పెళ్లి, ప్రీ-వెడ్డింగ్ క్రతువులు నిర్వహించే అర్చకులు వేదిక వద్దకు చేరుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం

ఈ పెళ్లికి హాజరు కాలేకపోతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలకు ఒక ప్రత్యేకమైన లేఖ పంపించి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ లేఖలో ప్రధాని మోదీ ఇలా రాశారు.

"తమ సినిమాల్లోని స్క్రిప్ట్‌లు విజయ్ లేదా రష్మికకు కొత్తేమీ కాదు. కానీ దేవుడు స్వయంగా రాసిన వారి నిజ జీవితంలోని ఈ కొత్త అధ్యాయం, ప్రేమ ఆప్యాయతలతో నిండిపోయి.. వెండితెరపై వారు సృష్టించిన మ్యాజిక్ కంటే అద్భుతంగా వెలిగిపోతుంది" అని అనడం గమనార్హం.

విరోష్ లవ్ స్టోరీ..

రష్మిక, విజయ్ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించడానికి చాలా కాలం ముందు నుంచే.. అభిమానులు వారిద్దరినీ కలిపి 'విరోష్' (Virosh) అని పిలవడం ప్రారంభించారు. వీరిద్దరూ 2018లో వచ్చిన 'గీత గోవిందం', 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఈ జంట అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు.

గత ఆదివారం (ఫిబ్రవరి 22) నాడు వీరు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఇద్దరూ ఒకే రకమైన నోట్స్‌ను పోస్ట్ చేసి, తమ అభిమానుల గౌరవార్థం ఈ పెళ్లిని 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని పిలుస్తున్నట్లు ఎంతో సంతోషంగా ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe