Yuvraj Singh On Delhi Protest: దేశ రాజధాని ఢిల్లీని విద్యార్థి ఉద్యమం కుదిపేస్తోంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని, ప్రస్తుత లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చారు.
యువరాజ్ సింగ్ ఆందోళన
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ చేపట్టిన ఈ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు బైఠాయించారు. ఈ ఆందోళనలపై భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలు పట్టువిడుపులు ప్రదర్శించాలని యువరాజ్ కోరారు. హింసతో ఏదీ సాధించలేమని, శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్పందించిన యువరాజ్ సింగ్, దేశంలో చదువుకునే ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరణం పొందే హక్కు ఉందన్నారు.
'చర్చలతోనే సత్ఫలితాలు': యువరాజ్ ఎమోషనల్ పోస్ట్
"ప్రతి చిన్నారి, విద్యార్థి, మహిళ సురక్షిత వాతావరణంలో చదువుకుని తమ కలలను నెరవేర్చుకునే హక్కు కలిగి ఉన్నారు. మన యువత సంక్షేమమే భారత్ భావి పునాది. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలు పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యకు ప్రశాంతమైన పరిష్కారం కనుగొనాలి" అని యువరాజ్ విజ్ఞప్తి చేశారు.
జంతర్ మంతర్ వద్ద రణరంగం.. కేజ్రీవాల్ పరామర్శ
పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీ వీధులు రణరంగాన్ని తలపించాయి. జంతర్ మంతర్ వద్ద పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంలో దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
{{/usCountry}}పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీ వీధులు రణరంగాన్ని తలపించాయి. జంతర్ మంతర్ వద్ద పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంలో దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
{{/usCountry}}విద్యార్థులు వేసుకున్న తాత్కాలిక టెంట్లను పోలీసులు తొలగించినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గకుండా అహోరాత్రులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు విపక్ష నేతలు జంతర్ మంతర్ను సందర్శించి విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు.
సోనమ్ వాంగ్చుక్కు విజ్ఞప్తి
మరోవైపు ఈ ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు సీజేపీ ప్రతినిధులు ఒక బహిరంగ లేఖ రాశారు.
"మా డిమాండ్ల సాధన కోసం మీరు చేస్తున్న త్యాగం వేలాది మందికి స్ఫూర్తినిచ్చింది. అయితే మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. దయచేసి మీ దీక్షను విరమించండి. పరీక్షల నిర్వహణలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని మేము ముందడుగు వేయిస్తాం" అని నిరసనకారులు ఆ లేఖలో స్పష్టం చేశారు.
విద్యార్థుల డిమాండ్లపై చర్చలు
ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.