డిజిటల్ ఉద్యమం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆయన అమెరికా నుంచి భారత్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారులకు కీలక పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా, క్రమశిక్షణతో సాగాలని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ నిరసనకు మద్దతు తెలుపుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ పోలీసులు అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేస్తే, తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
పోలీసులకు పూలు ఇవ్వండి: అభిజీత్ దీప్కే
ఢిల్లీలో అడుగుపెట్టిన అనంతరం అభిజీత్ దీప్కే ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. జంతర్ మంతర్ వద్ద మద్దతుదారులను కలుసుకోవడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
"నేను ఢిల్లీ చేరుకున్నాను. జంతర్ మంతర్ వద్ద మిమ్మల్ని కలవడానికి ఎంతో ఆత్రుతగా ఉంది. వచ్చేటప్పుడు చేతిలో ఒక పుస్తకం, మన త్రివర్ణ పతాకం తీసుకురావడం మర్చిపోకండి. పోలీసుల పట్ల మన కృతజ్ఞతను, ప్రేమను చాటుతూ వారికి పూలు ఇవ్వండి. ఈ ఉద్యమాన్ని మనం శాంతి, ప్రేమతో ముందుకు తీసుకెళ్లాలి" అని దీప్కే పిలుపునిచ్చారు.
వివిధ పోటీ పరీక్షలు, ఉద్యోగాల నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ యువత నేతృత్వంలో ఈ ఆన్లైన్ ఉద్యమం ఊపందుకుంది. నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE), సీయూఈటీ (CUET), ఎస్ఎస్సీ (SSC) వంటి పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో భారీ మద్దతు కూడగట్టుకున్న ఈ గ్రూప్.. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద నిరసన ప్రదర్శన ఇదే కావడం గమనార్హం.
అప్రమత్తమైన పోలీసులు.. వాంగ్చుక్ కీలక సూచనలు
నిరసనల్లో పాల్గొనే యువత శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, అధికారులకు సహకరించాలని సోనమ్ వాంగ్చుక్ సూచించారు. ప్రదర్శనకు వచ్చేవారు కేవలం నీళ్ల బాటిళ్లు, మొబైల్ ఫోన్లు వంటి అత్యవసర వస్తువులతో పాటు చేతిలో పూలు మాత్రమే పట్టుకోవాలని కోరారు. ఎవరైనా ఆయుధాలు లేదా అనుమానాస్పద వస్తువులతో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అలర్ట్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను అసాధారణంగా పెంచారు. దేశ రాజధాని వ్యాప్తంగా, ముఖ్యంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, సరిహద్దు ప్రాంతాలు, ఇతర సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిరసనకు సంబంధించి నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక అనుమతి పత్రాలు రాలేదని, కేవలం సోషల్ మీడియా సమాచారం ఆధారంగానే ముందస్తు చర్యలుగా 1,000 మందికి పైగా పోలీసులను రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్రిక్తతలకు తావులేకుండా, శాంతియుతంగా నిరసనలు ముగిసేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
{{/usCountry}}కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను అసాధారణంగా పెంచారు. దేశ రాజధాని వ్యాప్తంగా, ముఖ్యంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, సరిహద్దు ప్రాంతాలు, ఇతర సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిరసనకు సంబంధించి నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక అనుమతి పత్రాలు రాలేదని, కేవలం సోషల్ మీడియా సమాచారం ఆధారంగానే ముందస్తు చర్యలుగా 1,000 మందికి పైగా పోలీసులను రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్రిక్తతలకు తావులేకుండా, శాంతియుతంగా నిరసనలు ముగిసేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
{{/usCountry}}