దేశంలో మే 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ ఉంటాయి. సుమారు 12.40 లక్షలకుపైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ఫార్మాస్యూటికల్ వ్యాపారానికి సంబంధించిన ఇతర సమస్యలపై 2026 మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు.

మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, గుండె జబ్బులు, మూర్ఛ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసి, తగినంత నిల్వ ఉంచుకోవాలని సంఘం సూచించింది. అత్యవసర మందులు, ఇన్సులిన్, ఇన్హేలర్లు, పిల్లల మందులు, ఇతర ప్రాణరక్షణ మందులను అందుబాటులో ఉంచుకోవాలని పౌరులకు అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో భయాందోళనలతో మందులను కొనడం లేదా అనవసరంగా నిల్వ చేయడం వంటివి చేయవద్దని కోరింది.
బంద్ సమయంలో రోగులు నిర్దేశిత మందుల కోసం చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్లను వెంట ఉంచుకోవాలని, ఫార్మసీ సిబ్బందికి, అధికారులకు సహకరించాలని సంఘం సభ్యులు సూచించారు. వైద్య అత్యవసర పరిస్థితుల్లో, ప్రజలు తక్షణమే సమీపంలోని ఆసుపత్రులను, అత్యవసర వైద్య సేవలను లేదా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను సంప్రదించాలని కోరారు.
బంద్లో పాల్గొంటున్న కెమిస్టులు, డ్రగ్గిస్టులు అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసనలు చేపట్టాలని DCOIWA కోరింది. ప్రజా సంక్షేమం దృష్ట్యా, నిజమైన అత్యవసర పరిస్థితులలో ప్రాణరక్షక మందులను సరఫరా చేయవచ్చని సంఘం పేర్కొంది. రోగులు, అధికారులు లేదా అమలు చేసే ఏజెన్సీలతో ఘర్షణలకు దూరంగా ఉండాలని, అలాగే సోషల్ మీడియా వేదికల ద్వారా పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మెడికల్ షాపు యజమానులకు కూడా తెలిపింది.
బంద్ సమయంలో అత్యవసర, ప్రాణరక్షక మందులు సరిపడేంద ఉన్నాయో లేదో.. రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నిశితంగా పర్యవేక్షించాలని సంఘం కోరింది. కీలకమైన మందుల కొరతను నివారించడానికి ఆసుపత్రులు, అత్యవసర మందుల దుకాణాలు, టోకు వ్యాపారులు, జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకోవాలని కోరింది. అక్రమ అమ్మకాలు, బ్లాక్ మార్కెటింగ్, నకిలీ మందులు, అనధికార ఆన్లైన్ మందుల పంపిణీపై కూడా కఠిన నిఘా ఉంచాలని తెలిపింది.
{{/usCountry}}బంద్ సమయంలో అత్యవసర, ప్రాణరక్షక మందులు సరిపడేంద ఉన్నాయో లేదో.. రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నిశితంగా పర్యవేక్షించాలని సంఘం కోరింది. కీలకమైన మందుల కొరతను నివారించడానికి ఆసుపత్రులు, అత్యవసర మందుల దుకాణాలు, టోకు వ్యాపారులు, జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకోవాలని కోరింది. అక్రమ అమ్మకాలు, బ్లాక్ మార్కెటింగ్, నకిలీ మందులు, అనధికార ఆన్లైన్ మందుల పంపిణీపై కూడా కఠిన నిఘా ఉంచాలని తెలిపింది.
{{/usCountry}}బంద్ సమయంలో శాంతిభద్రతలను కాపాడాలని, ఫార్మసీలు, ఆసుపత్రులు, అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు రక్షణ కల్పించాలని పోలీసు విభాగాన్ని సంఘం కోరింది. బలవంతపు మూసివేతలు, బెదిరింపులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, లేదా అంబులెన్స్ సేవలకు, అత్యవసర వైద్య రవాణాకు అంతరాయం కలగకుండా నిరోధించాలని సూచించింది.
ఆన్లైన్ ఫార్మసీ నియంత్రించాలని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఆన్లైన్ కంపెనీలు తక్కువ ధరలకు మందులు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని ఆరోపిస్తోంది. అంతేకాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు మిస్యూజ్ అవుతున్నాయని, డ్రగ్స్ కూడా విచ్చవిలవిడిగా ఆన్లైన్లో విక్రయాలు అవుతున్నట్టుగా తెలిపింది.
మరోవైపు కార్పొరేట్ సెక్టార్లు ఇస్తున్న డిస్కౌంట్లు నియంత్రించాలని, ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించకుండా నేషనల్ ప్రైజ్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ అంశల మీద పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది.