...
...
Next Story

Bank holiday today : అలర్ట్- ఈరోజు బ్యాంకులకు సెలవు.. రేపు, ఎల్లుండి కూడా!

రెండొవ శనివారం, ఆదివారం కారణంతో వరుసగా రెండు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా హైదరాబాద్, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లోనూ బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

Published on: Sep 12, 2026, 08:15:45 IST
Advertisement

నేరుగా బ్యాంకు బ్రాంచ్​కి వెళ్లి నగదు విత్‌డ్రా చేయడం లేదా చెక్కులు డిపాజిట్ చేయడం వంటి పనులు పూర్తి చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే మీ ప్లాన్ మార్చుకోవాల్సిందే! సెప్టెంబర్ 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు శాఖలేవీ పనిచేయవు. శుక్రవారం నాడు బ్యాంకింగ్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెతో ఇప్పటికే సేవలకు ఆటంకం ఏర్పడగా, ఈరోజు రెండొవ శనివారం కావడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం బ్యాంకులకు అధికారిక సెలవు అమల్లోకి వచ్చింది.

ఈరోజు బ్యాంకులకు సెలవు..
ఈరోజు బ్యాంకులకు సెలవు..

ఆదివారం కూడా సాధారణ వారపు సెలవు కావడంతో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకు శాఖల తలుపులు మూతపడనున్నాయి.

సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి: తెలుగు రాష్ట్రాల్లోనూ సేవల నిలిపివేత!

వరుస సెలవుల ప్రభావం ఇక్కడితో ముగియడం లేదు. సెప్టెంబర్ 14న (సోమవారం) వినాయక చవితి (గణేష్ చతుర్థి) పండుగను పురస్కరించుకుని ఆర్బీఐ ప్రత్యేక సెలవు జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, భువనేశ్వర్ వంటి నగరాల్లో సోమవారం నాడు బ్యాంకులు మూతపడతాయి. దీనితో తెలుగు రాష్ట్రాల్లోని ఖాతాదారులకు సుదీర్ఘ వారాంతపు సెలవులు ఎదురయ్యే అవకాశం ఉంది.

సెప్టెంబర్ నెల మొత్తంలో పండుగలు, ఆదివారాలు, శనివారాల కోటా కలిపి మొత్తం 16 రోజుల పాటు బ్యాంకు శాఖల విక్రయాలు, సేవలు నిలిచిపోనున్నాయి.

ఏ శనివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయి?

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెలలోని 2వ, 4వ శనివారాల్లో బ్యాంకులకు పూర్తి స్థాయి సెలవు ఉంటుంది. అయితే 1వ, 3వ, 5వ శనివారాల్లో మాత్రం బ్యాంకు శాఖలు యథావిధిగా పనిచేస్తాయి. ఆయా శనివారాల్లో జాతీయ లేదా ప్రాంతీయ పండుగలు వస్తే తప్ప సిబ్బంది సేవలందిస్తారు.

డిజిటల్ బ్యాంకింగ్, ఏటీఎంలు అందుబాటులోనే..

ఏటీఎంలు : నగదు అవసరాల కోసం ఏటీఎం సెంటర్లు 24 గంటలూ పనిచేస్తాయి.

ఆన్‌లైన్ లావాదేవీలు: యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా నగదు బదిలీలు క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు.

ఇతర సేవలు: డెబిట్, క్రెడిట్ కార్డు అప్లికేషన్లు, లాకర్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు నిరాటంకంగా కొనసాగుతాయి.

అయితే చెక్కుల క్లియరెన్స్, కొత్త ఖాతాల తెరిచే ప్రక్రియ, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) జారీ వంటి ప్రత్యక్ష సేవల కోసం మాత్రం బ్యాంకులు తెరిచే వరకు వేచి చూడక తప్పదు.

రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా బ్యాంకు పనులను ముందస్తుగా నిపుణులు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks