...
...
Next Story

డైలీ 2జీబీ డేటా, 365 రోజుల వాలిడిటీ- ఈ బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్​ వృద్ధుల కోసమే! మాటిమాటికి రీఛార్జ్​ చేయాల్సిన పని లేదు..

కస్టమర్ బేస్​ని పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థ దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రూ. 1 రీఛార్జ్​ ప్లాన్​ని తీసుకొచ్చిన టెలికాం దిగ్గజం, ఇప్పుడు ‘సమ్మాన్​’ పేరుతో వృద్ధుల కోసం వార్షిక రీఛార్జ్​ ప్లాన్​ని ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 23, 2025, 10:40:03 IST
Advertisement

60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేకంగా ఒక ప్లాన్​ని తీసుకొచ్చింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్​ఎన్​ఎల్​). అదే 'సమ్మాన్ ప్లాన్'! ఇదొక సరికొత్త వార్షిక ప్లాన్‌. ఈ ప్లాన్ ధర రూ. 1,812. ఇది ఏడాది పొడవునా మొబైల్ కనెక్టివిటీతో పాటు రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీనియర్ సిటిజన్‌ల కోసం సమ్మాన్ ప్లాన్: పూర్తి వివరాలు..

బీఎస్​ఎన్​ఎల్​ సమ్మాన్​ ప్లాన్​ వివరాలు.. (AI)
బీఎస్​ఎన్​ఎల్​ సమ్మాన్​ ప్లాన్​ వివరాలు.. (AI)

ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ ఈ సమ్మాన్ ప్లాన్‌ను పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ నవంబర్ 18, 2025 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.

ప్లాన్ ప్రయోజనాలు:

  • ధర: రూ. 1,812
  • వ్యాలిడిటీ: 365 రోజులు (సంవత్సరం పొడవునా)
  • డేటా: రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా (తర్వాత వేగం తగ్గుతుంది)
  • వాయిస్ కాలింగ్: అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్
  • ఎస్​ఎంస్​: రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు
  • ఉచిత సిమ్: బీఎస్ఎన్ఎల్‌లో కొత్తగా చేరే కస్టమర్‌లకు ఉచితంగా సిమ్ కార్డు లభిస్తుంది.
  • అదనపు ప్రయోజనం: ఈ సబ్‌స్క్రైబర్‌లకు అదనపు ఖర్చు లేకుండా ఆరు నెలల పాటు BiTV సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ బేస్‌ను పెంచడానికి, వివిధ వినియోగదారు వర్గాలకు చవకైన కనెక్టివిటీ ఎంపికలను అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ సిటిజన్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. స్థిరమైన నెట్‌వర్క్‌ను కోరుకునే వృద్ధులకు దీర్ఘకాలిక, సౌకర్యవంతమైన మొబైల్ సేవలను అందించాలనేది ఈ ప్లాన్ లక్ష్యం.

ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్, బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్-కేర్ యాప్, అధీకృత రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా అందుబాటులో ఉంది.

కొత్త కస్టమర్లకు దీపావళి బొనాంజా ప్లాన్: రూ. 1కే 4జీ సేవలు..

రూ. 1 ప్లాన్: కొత్త కస్టమర్లు కేవలం రూ. 1కి ఒక ప్రత్యేక 4జీ ప్లాన్‌ను పొందవచ్చు.

ప్రయోజనాలు: రోజుకు 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు, కేవైసీ ధృవీకరణ తర్వాత ఉచిత సిమ్ యాక్టివేషన్ లభిస్తాయి.

వ్యాలిడిటీ: ఈ రూ. 1 ఆఫర్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

అందుబాటు: ఈ ఆఫర్ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.

తొలిసారి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కంపెనీ అప్‌గ్రేడ్ చేసిన 4జీ నెట్‌వర్క్ అనుభవాన్ని అందించడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది.

ఇతర పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లు..

బీఎస్ఎన్ఎల్ ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు పండుగ డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది!

రూ. 485, రూ. 1,999 ప్లాన్‌లు: సెల్ఫ్-కేర్ యాప్ లేదా బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లు ఈ రెండు ప్లాన్‌లపై 5% పండుగ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఈ ప్రయోజనంలో సగం (2.5%) తక్షణ తగ్గింపుగా లభిస్తుంది. మిగిలిన సగం (2.5%) సామాజిక సేవా ప్రాజెక్టులకు చేరుతుంది.

గిఫ్ట్ రీఛార్జ్: ఒక వ్యక్తి మరొకరికి రీఛార్జ్ గిఫ్ట్‌గా పంపితే, రీఛార్జ్ అందుకున్న వ్యక్తి వారి ప్లాన్‌పై అదనంగా 2.5% తగ్గింపును పొందుతారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks