కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక రంగానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు. దేశంలోని అరుదైన ఖనిజాల (Rare Earth Minerals) నిల్వలను వెలికితీసి, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
₹7,280 కోట్ల భారీ ప్రోత్సాహకాలు

భారతదేశంలో రేర్ ఎర్త్ అయస్కాంతాల (Rare-earth magnets) తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ₹7,280 కోట్ల ఇన్సెంటివ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల సహాయంతో దేశవ్యాప్తంగా ఐదు భారీ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, విక్రయించే ప్రతి కిలో అయస్కాంతంపై రాయితీలు కల్పించనున్నారు.
భారతదేశం వద్ద సుమారు 6.9 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద నిల్వల్లో ఒకటి కావడం విశేషం. అయితే, వీటి వెలికితీత, ప్రాసెసింగ్ ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది, కాలుష్యంతో కూడుకున్నది కావడంతో ఇప్పటివరకు మనం వెనుకబడ్డాం.
చైనాకు చెక్ - స్వయం సమృద్ధి దిశగా..
ఈ నిర్ణయం వెనుక బలమైన వ్యూహం ఉంది. 2025లో భారత ఆటోమొబైల్ రంగం రేర్ ఎర్త్ అయస్కాంతాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడింది. ప్రపంచవ్యాప్తంగా వీటి సరఫరాలో 90% పైగా వాటా ఉన్న చైనా, 2025 ఏప్రిల్ నుంచి ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో భారత పరిశ్రమలు కుదేలయ్యాయి.
ఈ విదేశీ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి భారత్ ఇప్పుడు 'మోనాజైట్' వంటి ఖనిజాల నుంచి దేశీయంగానే సరఫరా గొలుసును (Supply Chain) నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) ఈ ఖనిజ ఆక్సైడ్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త పథకం కింద ఐఆర్ఈఎల్ సుమారు 500 టన్నుల ఆక్సైడ్లను తయారీదారులకు సరఫరా చేయనుంది.
ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఊతం
“ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటన ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఇకో సిస్టమ్కు ఎంతో మేలు చేస్తుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, మైనింగ్ నుంచి తుది ఉత్పత్తి వరకు దేశీయంగానే వాల్యూ-చైన్ నిర్మించడానికి ఇది తోడ్పడుతుంది.” — సాకేత్ మెహ్రా, పార్ట్నర్, గ్రాంట్ థోర్న్టన్ భారత్
{{/usCountry}}“ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటన ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఇకో సిస్టమ్కు ఎంతో మేలు చేస్తుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, మైనింగ్ నుంచి తుది ఉత్పత్తి వరకు దేశీయంగానే వాల్యూ-చైన్ నిర్మించడానికి ఇది తోడ్పడుతుంది.” — సాకేత్ మెహ్రా, పార్ట్నర్, గ్రాంట్ థోర్న్టన్ భారత్
{{/usCountry}}ఈ కారిడార్ల ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి పెరగడమే కాకుండా, ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ రంగాలకు అవసరమైన విడిభాగాల తయారీ సులభతరం కానుంది.