క్లాడ్ (Claude) సేవల్లో అంతరాయం: వినియోగదారుల అవస్థలు.. పరిష్కార మార్గాలివే
ప్రముఖ ఏఐ చాట్బాట్ 'క్లాడ్' (Claude) సేవలు గురువారం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. డౌన్డిటెక్టర్ (Downdetector) నివేదిక ప్రకారం, వేలాది మంది వినియోగదారులు చాట్ సదుపాయం పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు.
క్లాడ్ చాట్ విండోలో ప్రాంప్ట్ను టైప్ చేసి ఎంటర్ కొట్టగానే, పేజీ రీలోడ్ అవ్వడం లేదా స్పందన రాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. బ్రెజిల్, రష్యా వంటి దేశాల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో, ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సర్వర్ అంతరాయమని స్పష్టమవుతోంది. ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ ఇప్పటివరకు ఈ సమస్యపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
క్లాడ్ పనిచేయకపోతే.. మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఇవే
సర్వర్ స్థాయిలోనే సమస్య ఉన్నప్పుడు వినియోగదారుల వైపు నుంచి చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయితే, చిన్నపాటి సాంకేతిక లోపాలు ఉన్నప్పుడు ఈ క్రింది పద్ధతులు పని చేయవచ్చు.
సర్వర్ స్టేటస్ తనిఖీ: ముందుగా క్లాడ్ అధికారిక 'స్టేటస్ పేజీ'ని సందర్శించి, సర్వర్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోండి.
హార్డ్ రిఫ్రెష్: బ్రౌజర్లో తాత్కాలిక సమస్యలను తొలగించడానికి 'Ctrl + F5' (Windows) లేదా 'Cmd + Shift + R' (Mac) ఉపయోగించి పేజీని హార్డ్ రిఫ్రెష్ చేయండి.
ఇన్కాగ్నిటో మోడ్ (Incognito): సాధారణ విండోలో సమస్య ఉంటే, ఇన్కాగ్నిటో మోడ్లో క్లాడ్ వెబ్సైట్ను ఓపెన్ చేసి ప్రయత్నించండి.
VPN డిసేబుల్: ఒకవేళ మీరు VPN ఉపయోగిస్తుంటే, దానిని తాత్కాలికంగా ఆపివేసి లాగిన్ అవ్వండి.
క్యాచ్ క్లియర్: బ్రౌజర్ క్యాచ్ (Cache) డేటాను క్లియర్ చేయడం లేదా కొత్త విండోలో లాగిన్ అవ్వడం ద్వారా కొన్నిసార్లు సమస్య పరిష్కారం అవుతుంది.
కొత్త చాట్: సుదీర్ఘమైన చాట్ సంభాషణల వల్ల మెమరీ లోడ్ పెరిగి వెబ్ యాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. అటువంటప్పుడు కొత్త చాట్ను ప్రారంభించడం మేలు.
ప్రస్తుతం సర్వర్ల స్థాయిలోనే సమస్య ఉండటం వల్ల, ఆంత్రోపిక్ సాంకేతిక బృందం మరమ్మతులు పూర్తి చేసే వరకు వినియోగదారులు వేచి ఉండక తప్పదు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


